Telangana: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం: పల్లె లక్ష్మణ్ రావు గౌడ్

Telangana :కాంగ్రెస్ తోనే బీసీలకు న్యాయం
తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు ఇది
చారిత్రాత్మకమైన రోజు అని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టడం పై లక్ష్మణ్ రావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చట్టసభల్లో బీసీ బిల్లు ఆమోదంతో బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. బీసీ బిల్లును ప్రవేశపెడుతున్న కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కలిసి రాకపోతే బీసీ సామాజికవర్గం ఆ పార్టీలను ఎన్నటికీ క్షమించదన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో కాంగ్రెస్‌ పార్టీ పేదలకు న్యాయం చేస్తుందని మరోసారి రుజువైందని… కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజా శ్రేయస్సే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, పీసీసీ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులకు లక్ష్మణ్ రావు గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

More From Author

Tirupati: మంత్రి కొండా సురేఖ చొరవ.. సిఫార్సు లేఖలకు టీటీడి అనుమతి..!