జగన్ పాలనపై జనసేన సెటైరికల్ కార్టూన్.. కామెంట్లతో ఆడేసుకుంటున్న జనసైనికులు..

Janasena: జగన్ ప్రభుత్వంపై జనసేన సెటైరికల్ కార్టూన్స్ తో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఆ పార్టీ రూపొందించిన కార్టూన్ పై సోషల్ మీడియాలో జన సైనికులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అటు నెటిజన్స్ సైతం తమదైన శైలిలో వైసిపి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. ఇక తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ పరిశీలిస్తే.. ఇక లాభం లేదు ఈవిఎమ్ బటన్ నొక్కి.. ఈ బటన్ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిందే క్యాప్షన్ కి తోడు.. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు…

Read Full News

వైసీపీ విముక్త రాష్ట్రo జనసేన లక్ష్యం : పవన్ కళ్యాణ్

Janasena: కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి వేతుకుంటు వస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవి వస్తేనే పొత్తులు పెట్టుకోవాలని కొందరు అంటున్నారు.. గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచి ఉంటే  ఆ వాదనకు బలం చేకూరేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి వరించాలి తప్ప వెంపర్లాడనని తేల్చిచెప్పారు. మా గౌరవానికి భంగం కలగకుండా ఉంటే కలసి ముందుకు వెళ్తామని, వైసీపీ దాష్టికాలను బలంగా ఎదుర్కొంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేసులో నేను లేను…

Read Full News

విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?: పవన్ కళ్యాణ్

Janasena: ‘అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్నారు పవన్ కళ్యాణ్. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామ’ని ఆయన తేల్చిచెప్పారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు మంగళవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు. రైతులతో…

Read Full News

‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’… జనసేన లక్ష్యం: నాదెండ్ల మనోహర్

Janasena: ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. దీని కోసం కచ్చితంగా వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నదే జనసేన అభిమతమన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ…

Read Full News

జగనన్న పోవాలి.. పవనన్న రావాలంటున్న మత్స్యకారులు : నాదెండ్ల మనోహర్

Janasena:‘రాష్ట్రంలో కౌలు రైతుల వెతలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా మత్స్యకారుల వేదనలు ఉన్నాయన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేవలం రూ.10 వేల వేతనానికి మత్స్యకారులు గుజరాత్, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వలసలు వెళ్లి బతుకుతున్నార’ని  ఆయన వాపోయారు. గతంలో మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ సమయంలో పాదయాత్ర చేయాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఓ మత్స్యకార గ్రామాన్నయినా ముఖ్యమంత్రి స్వయంగా సందర్శిస్తే వారి బాధలు, బతుకులు అర్థం అవుతాయని…

Read Full News

మత్స్యకార భరోసాలో అవకతవకలపై జనసేన పోరాటం: నాదెండ్ల మనోహర్

Janasena: మత్సకార భరోసా పథకం అమల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో మత్స్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ కి వినతిపత్రం సమర్పించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.  మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్న తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరుల్లో ఆందోళన, అలజడి ఉన్నాయన్నారు. గత ఏడాది జాబితాలో ఉన్న పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం వద్ద ఉన్న…

Read Full News

‘జగనన్న పాపం పథకం’తో పోలవరం ప్రాజెక్టుకి శాపం: జనసేన నాదెండ్ల మనోహర్

APpolitics: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని పాపం ముఖ్యమంత్రి  జగన్ రెడ్డిదేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టిన తీరుకు జగనన్న పాపం పథకం అని పేరు పెట్టాలన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు నెపం కేంద్రం మీద వేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు మినహా ఈ ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రం నిధులు రీఎంబర్స్…

Read Full News

ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?

Nancharaiah merugumala : (senior journalist) కాపులు ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపు ఇచ్చాక బీసీలు, ఎస్సీలు భయపడే ప్రమాదం లేదా? ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత? ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చిన్న కులాలకు భయపడరు. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి,’’ ఇలా సాగింది మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ…

Read Full News

చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయంటే..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. గ‌త‌ ఎన్నిక‌ల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై ప‌ట్టుసాధించాల‌ని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని క‌సితో ఉంది. ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితులు.. ప్ర‌జాభిప్రాయం అనుగుణంగా …ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట‌. కానీ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ…

Read Full News

రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా జనసేన ఆవిర్భావ సభ: నాదెండ్ల మనోహర్

మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుందన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read Full News
Optimized by Optimole