‘పవన్ ‘అభిమన్యుడు కాదు అర్జునుడు: ఎంపీ రఘురామ

సమాజ హితం కోసం బాబు, పవన్ కలువాల్సిందేనన్నారు ఎంపీ  రఘురామ కృష్ణంరాజు.ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించడమే  తక్షణ కర్తవ్యమన్నారు. వ్యక్తిగత మేలు కోసం కాకుండా.. ప్రజల కోసం ఏకం కావడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.పసుపు, ఎరుపు రంగు కలిస్తే కాషాయమేనని తేల్చిచెప్పారు.  గతంలో జగన్ ను తిట్టిన వారే ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని రఘురామ గుర్తు చేశారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కావడం…

Read More

మత్స్యకారులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల మనోహర్

ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విద్య, వైద్యం, వలసల నిరోధం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేహీ అంటూ అడుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఆయన..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు.  ఇక…

Read More

శతదళం.. సమరగళం.. యువగళం: నాదెండ్ల మనోహర్

పదులు కాదు… వందలు కాదు… ఏకంగా వేలాది యువ గళాలు గొంతు విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్ నాదెండ్ల మనోహర్. యువగళాలు మండే నిప్పు కణికల్లాంటి ప్రశ్నలను సంధించేందుకు యువశక్తి వేదిక కాబోతుందన్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే మహోత్తర కార్యక్రమంలో మాట్లాడేందుకు.. 100 మంది యువతకు అవకాశం ఇవ్వాలని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు వెల్లడించారు.  ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి…

Read More

చెల్లి ప్రియాంకకు పెట్టిన ముద్దుకు విపరీత ప్రచారం ఇచ్చుకున్న ‘రాహుల్‌ భయ్యా’!

ఎదురొచ్చిన మహిళలందరికీ ‘జగనన్న’ ముద్దులు పెట్టుకుంటూ పోతే… నెహ్రూ–గాంధీ ‘రాజకుటుంబం’ కాలంతో పాటు మారదంటే మారబోదు అని మరోసారి మొన్న రుజువైంది. రాజధాని దిల్లీకి సమీపంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌ నగరం బాగపత్‌ లో భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై రాహుల్‌ తన వెంట ఉన్న చెల్లెలు ప్రియాంకా గాంధీ వాడ్రా భుజంపై ఎక్కడ లేని ప్రేమతో చేయి వేసి ఆమె బుగ్గను ముద్దాడారు. కాస్త ఇబ్బందిపడిన ప్రియాంక తొలి భారత కుటుంబంలోని అన్నా…

Read More

ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ

ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు. బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని…

Read More

అవకాశం అదే .. అగ్ని పరీక్షా అదే!

నారా లోకేష్‌లో పరివర్తన నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెనుకుదుపే! తండ్రి చాటు బిడ్డ అని ముద్రపడ్డ లోకేష్‌ రాజకీయంగా తననుతాను నిరూపించుకోవడానికి ‘యువగళం’ పాదయాత్ర ఎంతటి అగ్నిపరీక్షో అంతకుమించి అరుదైన అవకాశం. దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్‌ మసకబారి, బిజెపి మొగ్గవిచ్చని స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా … ఎ.పి.లో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి ని ధీటుగా ఎదుర్కోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చే చంద్రబాబు రాజకీయ వారసుడిగా నిరూపించుకోవడమా? దారి…

Read More

యువతరం గళం వినిపించేందుకు సరైన వేదిక ‘యువశక్తి’: నాదెండ్ల మనోహర్

జనసేన ‘యువశక్తి’ కార్యక్రమం యువతరం గళం వినిపించేందుకు సరైన వేదికన్నారు ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. స్వామి వివేకనంద జయంతి రోజున నిర్వహించే ఈ సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఉత్తరాంధ్ర యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇక్కడి ప్రజల బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదన, ఉద్దానంలో ఆరోగ్య క్షీణత.. ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన విజయగాధలు…

Read More

జగన్ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అన్యాయం : ఏపీసీసీ రుద్రరాజు

విజయవాడ: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎనిమిదిన్నరేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లను ఓటు బ్యాంకు గా వాడుకొని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు..మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింపచేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.  ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ త్వరలోనే అమలు చేయబోతున్నట్లు రుద్రరాజు వెల్లడించారు.జనవరి…

Read More

కాపులకు సంపూర్ణ ‘రాజ్యాధికారం’ రాకున్నా..‘రాజకీయాధికారం’ వచ్చేసిందా?

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులూ కాపులే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి తమ నాలుగు కులాల్లో దేనికీ రాలేదనే బాధ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను ఇప్పుడు దహించివేస్తోంది. నిజమే. సంపూర్ణ ‘రాజ్యాధికారం’ ఇంకా ఈ నాలుగు కులాల సముదాయానికి గగన కుసుమం మాదిరిగానే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పేరిట జరిగిన తొలి ‘రాజ్యాధికార’ ప్రయత్నం విఫలమైంది. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేయని జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీని అమరావతిలో అందలమెక్కించింది….

Read More

‘యువశక్తి’ ఉద్దేశ్యం ‘మన యువత… మన భవిత’ : జనసేనాని

శ్రీకాకుళంలో స్వామి వివేకానంద జయంతి రోజును పురస్కరించుకుని జనసేన ‘యువశక్తి ‘ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా సభను భారీ ఎత్తులో నిర్వహించేందుకు జన సైనికులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ‘యువశక్తి ‘ కార్యక్రమం  పోస్టర్లను జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ…

Read More
Optimized by Optimole