Hyderabad: ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు : టీపిసిసి చీఫ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఆషాఢ మాసంతో పాటు బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.భక్తి, శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖంగా, శాంతిగా, ఆయురోగ్యంతో జీవించాలన్నారు. ఇక తల్లి దీవెనలతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు….