Telangana: రణమా… శరణమా?… గులాబీ పార్టీలో అంతర్మథనం..!
Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే మరోవైపు బీజేపీ వేగంగా బలపడుతుండటం గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ను ఆలోచనలో పడేసిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్తో పోరాటం ఒక ఎత్తైతే… బీజేపీతో భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండాలన్న అంశంపై బీఆర్ఎస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. బీజేపీతో పోరాడాలా…? లేక రాజకీయంగా దగ్గరవ్వాలా…? అనే…
