కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….