Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…
Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ మొత్తం 17 అంశాలతో ‘సుస్థిరాభివృద్ది లక్ష్యాల’ (ఎస్డీజీస్) ను యూఎన్ ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. దాదాపు రెండు వందల దేశాలు దీన్ని అంగీకరించి, సంతకాలు చేసి, ఆ దిశలో చర్యలు చేపట్టి ముందడుగు వేస్తున్నాయి. అందులో మన దేశం ‘భారత’ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం…
