Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…