Hyderabad: వైద్య సేవల పరంగా ఎలాంటి రాజీ ఉండకూడదు : అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
వనస్థలిపురం, జూన్ 26: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడి వైద్య సౌకర్యాలు, నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులను, ప్రసూతి వార్డులను ప్రత్యేకంగా సందర్శించిన ఆమె, అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. పలు విభాగాల్లో పరికరాల కొరత ఉందని, కొన్ని చోట్ల…