AyodhyaRammandir: హిందువులు ఏళ్ల నాటి అయోధ్య రామ మందిర నిర్మాణం కల సాకారం కాబోతోంది. ఇప్పటికే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో జరిపిందేకు రామ మందిరం ట్రస్టు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో సైతం రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిసింది. అమెరికా లోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఓ వార్త ప్రత్రిక పేర్కొంది. అలాగే అయోధ్య పవిత్రోత్సవం వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయా లలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇక ఆరాధ్య దైవం అయిన రామ భక్తులను ఉద్దేశించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుండి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది.
కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రామ్లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగి రాజ్ తీర్చిదిద్దారు.ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహా న్ని నూతన విగ్రహంతో పాటు గర్భ గుడిలో ప్రతిష్ఠించ నున్నారు.