నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటి నివేదా థామస్ ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘ ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను’’ అంటూ ఆమె ఓ ఫొటో షేర్ చేశారు. చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆమె ఆరు నెలలపాటు ట్రెక్కింగ్లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ఇటీవల ‘వకీల్సాబ్’తో నివేదా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. పవన్కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నివేదా పల్లవి అనే అమ్మాయి పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘మీట్ క్యూట్’లో నటిస్తున్నారు.

Posted inNews