పార్లమెంట్ లో ఇండియా కూటమిని ఏకిపారేసిన బండి సంజయ్..

BJPTelangana: భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సైతం విరుచుకుపడ్డారు. ‘‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. ఇట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నవ్వొస్తుందని బండి ఎద్దేవ చేశారు. ఏ కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ… సభ్ లోగ్ మిల్ కర్ ఆయే తోబీ మోడీ జీ కో నహీ రోకేంగే…. భరతమాత జోలికొస్తే కన్ను పీకే ఆదర్శనేత నరేంద్రమోదీ’’అంటూ ఫైర్ అయ్యారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరుగుతున్న చర్చపై బీజేపీ పక్షాన బండి సంజయ్ 10 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సందర్భగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమితోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల తీరును ఎండగట్టారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ను పూర్తిగా తప్పుదోవ పట్టించాయన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు ‘‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా… ఇదిగో నా రాజీనామా… నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’’ అంటూ సంజయ్ సవాల్ విసిరారు.  

కాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యలు…కాంగీ, దీదీ, కేజ్రీ, జేడీ ఔర్ కేడీ.. మోదీని ఏమీ చేయలేవని బండి అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా వ్యతిరేకిస్తూ మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్మానం ఎందుకు ప్రవేశఫెట్టారో కాంగ్రెస్ వారికే తెలియదన్నారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాయకుడి వ్యవహారశైలి చూసి ప్రపంచమంతా నవ్వుతోందన్నారు. అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ భారతమాతను హత్య చేశారంటూ కించపర్చారు. భారత మాతవైపు కన్నెత్తి చూస్త్తే కళ్లు పీకే ఆదర్శ నేత మోదీ అని కొనియాడారు.  ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు…  యే కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ… వీళ్లతో మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని.. మోదీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోందని బండి విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…సుష్మాకు సెల్యూట్…

ఈ పవిత్రమైన పార్లమెంట్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణను సాకారం చేసిన దేవాలయమిది(పార్లమెంట్) బండి భావోద్వేగంగా మాట్లాడారు . ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల 1400 మంది యువకులు బలయ్యారు. జై తెలంగాణ అంటూ రివాల్వర్ తో కాల్చుకున్నరు. ట్రైన్ కు ఎదురుగా పోయి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సభ వేదికగా తెలంగాణ బిల్లు పెడతారా, మేం వచ్చాక ఇవ్వమంటారా? అంటూ సుష్మా స్వరాజ్ నిలదీస్తే ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికి మీరు బతికి ఉండాలని అప్పీల్ చేస్తే యువతకు భరోసా ఇచ్చిన మహనీయురాలు అని సంజయ్ గుర్తు చేసుకున్నారు.

చీమల పుట్టలో తాచుపాము జొర్రింది..

చీమల పుట్టలో తాచుపాము జొర్రినట్లు..తెలంగాణలో ఒక కుటుంబం  జొర్రింది…అవినీతి యూపీఏ ఐఎన్డీఐఏగా ఎట్లా మారిందో….. బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి అని బండి ఆరోపించారు. బీఆర్ఎస్ లీడర్ పేరు ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు. బీఆర్ఎస్ నేతది ఒకే పని… అదేమిటంటే.. రాత్ బర్ పీతా… దిన్ బర్ సోతా… కిస్ సే బీ నహీ మిల్ తా… యే హై దేశ్ కీ నేత అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

భరతమాతను తలచి కొలిచే సంస్థ ఆర్ఎస్ఎస్..

లిక్కర్ తో సంబంధమున్నది కాంగ్రెస్ కే… ఈ దేశంలో సనాతన సంప్రాదాయంతో హిందూ సంఘటిత శక్తిని ఏకం చేసే క్రమశిక్షణ కలిగిన సంస్థ ఆర్ఎస్ఎస్.. ‘‘నమస్తే సదావత్సలే మాత్రుభూమే.. త్వయా హిందుభూమే సుఖం వర్ధితోహమ్. మహామజ్గలే పుణ్యభూమే త్వదర్థే… పతత్వేష కాయే నమస్తే నమస్తే’’ అంటూ  భారత మాతను తలచి కొలిచి ఆరాధించే గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్. అంత గొప్ప సంఘాన్ని నిక్కర్ లిక్కర్ అంటూ అవమానించే కాంగ్రెస్ కు పుట్టగతులుండవ్ అని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Optimized by Optimole