8.9 C
London
Wednesday, January 15, 2025
HomeLatestBandisanjay: రుణ‌మాఫీ అమలుపై కాంగ్రెస్ మాట త‌ప్పింది: బండిసంజ‌య్‌..

Bandisanjay: రుణ‌మాఫీ అమలుపై కాంగ్రెస్ మాట త‌ప్పింది: బండిసంజ‌య్‌..

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

Bandisanjay: రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పిందన్నారు కేంద్ర‌హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్‌. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప జేస్తుండటం అన్యాయమ‌ని అన్నారు. ఈ లెక్కన నూటికి 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడం దారుణమ‌ని.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకుపైమాటేన‌ని.. అందులో 10వంతు మాత్రమే చెల్లించి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంద‌ని బండి దెప్పిపొడిచారు.

రుణ‌మాఫీ అమ‌లుపై సంబురాలు చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్దపడటం సిగ్గుచేటన్నారు బండి. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారని? .. రబీ, ఖరీఫ్ లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? నూటికి 70 మంది రైతులకు క్షోభ మిగిల్చేలా నిర్ణయం తీసుకున్నందుకాని? ఆయ‌న ప్ర‌శ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా తప్ప రైతులపట్ల ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తుశుద్ధి లేదన్నారు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు 39 లక్షలు కాగా.. మిగిలిన వారికి రుణమాఫీ చేయకపోవడానికి కారణాలేమిటో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రెండు విడతల్లో కలిపి గత ఏడాది దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు చేసింద‌న్నారు సంజ‌య్‌. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో 14 లక్షల కౌలు రైతు కుటుంబాలు, 10 లక్షలకుపైగా రైతు కూలీల కుటుంబాలున్నాని అన్నారు. వీరితో కలిపి రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున చెల్లించాలంటే రూ.20వేల కోట్లకుపైగా నిధులు అవసరమ‌న్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టి…అందులో మూడోవంతు నిధులను రుణమాఫీకి మళ్లించి గొప్పలు చెప్పుకుంటూ సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటని సంజ‌య్ మండిప‌డ్డారు.

ఇప్పటికే రుణమాఫీ అమలు కాకపోవడంతో అసలు, వడ్డీలు చెల్లించకలేక రాష్ట్రంలోని మెజారిటీ రైతులు డిఫాల్టర్ల జాబితాలో చేరారని సంజ‌య్ అన్నారు. రైతులు డిఫాల్టర్లుగా మారడానికి గత ప్రభుత్వ మూర్ఖపు వైఖరే కారణమ‌న్నారు. సకాలంలో రుణమాఫీ చేసి ఉంటే రైతులు డిఫాల్టర్లుగా మారేవారు కాదన్నారు. ప్రభుత్వ తప్పిదానికి రైతులెందుకు మూల్యం చెల్లించాలో చెప్పాల‌ని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు రైతులు తీసుకున్న అప్పులన్నింటికీ అసలు, వడ్డీతోసహా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిబంధనలు, కొర్రీల పేరుతో ఇబ్బంది పెట్టకుండా బ్యాంకుల నుండి తీసుకున్న ఆయా రుణాల మొత్తాన్ని చెల్లించి ‘డిఫాల్టర్ల’ జాబితా నుండి రైతులను తొలగించి కొత్తగా రుణాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజ‌య్ కోరారు .

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole