జగనన్న పోవాలి.. పవనన్న రావాలంటున్న మత్స్యకారులు : నాదెండ్ల మనోహర్

Janasena:‘రాష్ట్రంలో కౌలు రైతుల వెతలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా మత్స్యకారుల వేదనలు ఉన్నాయన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేవలం రూ.10 వేల వేతనానికి మత్స్యకారులు గుజరాత్, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వలసలు వెళ్లి బతుకుతున్నార’ని  ఆయన వాపోయారు. గతంలో మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ సమయంలో పాదయాత్ర చేయాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఓ మత్స్యకార గ్రామాన్నయినా ముఖ్యమంత్రి స్వయంగా సందర్శిస్తే వారి బాధలు, బతుకులు అర్థం అవుతాయని…

Read More

తెలంగాణలోని సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: సిఎల్పీ భట్టి విక్రమార్క

Tcongress: పీపుల్స మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి మా పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. మా బతుకులు అగమవుతున్నాయి. తినేందుకు తిండి కూడా సంపాదించలేకపోతున్నాం. గీతం కార్మికులు మొత్తంగా చెట్లు ఎక్కడం బంద్ చేసే రోజులు వచ్చాయి. మేము చాలా కష్టాల్లో ఉన్నాము….

Read More

Karnataka: హంగ్ ‘ కింగ్ ‘ కుమార స్వామి..

Karnataka elections2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల(మే)లో జరగనున్నాయి.  అధికారంలో నిలబెట్టుకోవాలని బీజేపీ.. అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ .. హంగ్ వస్తే కింగ్ మేకర్ తామేనని  జేడిఎస్ పార్టీలు ధీమాతో ఎన్నికల ప్రచారాన్ని  తగ్గేదేలా తరహాలో  నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన పలు సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని.. గత ఎన్నికల మాదిరి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే  అవకాశం లేదని తేలింది. మరోవైపు ఎన్నికల  ఫలితాల అనంతరం బీజేపీ, అయినా…

Read More

పోచారం, గుత్తా..అధినేత కేసీఆర్‌ పక్కన కూసోవడం చూడ ముచ్చటగా ఉంది!

Nancharaiah merugumala senior journalist: “చట్టసభల అధ్యక్షులు పోచారం, గుత్తా తమ  అధినేత కేసీఆర్‌ పక్కన చిన్న కుర్చీల్లో కూసోవడం చూడ ముచ్చటగా ఉంది! తెలంగాణ రెడ్ల విధేయతే వారికి శ్రీరామరక్ష” భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి ఎడమ పక్కన తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం ‘పరిగె’ శ్రీనివాస్‌ రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూర్చున్నారు. తెలంగాణలోని రెండు చట్టసభల అధ్యక్షులైన ఈ…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎపిసిసి వినూత్న కార్యక్రమం..

విజయవాడ: కర్ణాటక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో…కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు  గిడుగు రుద్ర రాజు..ఆంధ్ర నుండి బెంగళూరు వెళ్లే బస్సులలో ట్రైన్లలో కరపత్రాలు పంచుతూ హస్తం పార్టీ గెలుపును కృషి చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. బెంగళూరుకు వెళ్లే తెలుగువారికి కాంగ్రెస్ పార్టీ రావలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఆయన పంపిణీ చేసిన కరపత్రాలు సోషల్ మీడియాలో హాట్ ఆఫ్…

Read More

కాంగ్రెస్ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోంది : బండి సంజయ్

BJPTelangana: కర్నాటక ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీ ఖేల్ ఖతం … దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతుండటం…

Read More

మత్స్యకార భరోసాలో అవకతవకలపై జనసేన పోరాటం: నాదెండ్ల మనోహర్

Janasena: మత్సకార భరోసా పథకం అమల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో మత్స్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ కి వినతిపత్రం సమర్పించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.  మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్న తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరుల్లో ఆందోళన, అలజడి ఉన్నాయన్నారు. గత ఏడాది జాబితాలో ఉన్న పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం వద్ద ఉన్న…

Read More

పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్వీర్యం చేసింది: నాదెండ్ల మనోహర్

Jansena: పోలవరం ప్రాజెక్టుని  జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ చర్యలు కేవలం రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన పార్టీ పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే నెలలో…

Read More

“ఉదయాస్తమయాలా! అవేంటి?”..

“ఉదయాస్తమయాలా! అవేంటి?” అవును, నువ్వలా అడుగుతావని తెలుసు. అందుకే, ‘రెండు మూడ్రోజులైనా ఉండేలా మా ఊరికి రా! చూపిస్తా’ పని… పని… పని… అది ఉన్నా లేకున్నా పగలు, రాత్రి తేడాల్లేకుండా పరుగులు పెడతూ కృత్రిమ కాంతిలో కుస్తీలు పట్టే నువ్వు….. అర్థరాత్రి ఏ పన్నెండు తర్వాతో పడకెక్కి, ఎటు తిరిగి ఆరేడు గంటల్ని నిద్ర-మేల్కల నడుమ నలిపి, నలిగి ఎవరో తరిమినట్టు… బారెడు పొద్దెక్కాక నిద్దర లేచే నీకు.. అవెలా తెలుస్తాయి..? ఉహూ..తెలువవు! స్విచాన్-స్విచాప్… విద్యుత్…

Read More

కాంగ్రెస్ కి ఓటేద్దాం… బీజేపీని సాగనంపుదాం : గిడుగు రుద్రరాజు

APCONGRESS: 2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దానికి ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలి ఉంది. కానీ, ఇప్పటి వరకూ కనీసం ఒక్క హామీ కూడా బీజేపీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని, 2014 సాధారణ ఎన్నికల…

Read More
Optimized by Optimole