దయానిధి మారన్‌ యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?

Nancharaiah merugumala senior journalist: ” దేవదాసీ కుల, కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్‌..యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?” ఉత్తరప్రదేశ్, బిహార్‌ నుంచి వచ్చిన ఇంగ్లిష్‌ రాని కార్మికులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుగున్నారని డీఎంకే లోక్‌ సభ సభ్యుడు దయానిధి మారన్‌ గతంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర నిరసనకు కారణమైంది. డీఎంకే నాయకుడు ఎం. కరుణానిధి మేనల్లుడి (అక్క కుమారుడు మురసోలి మారన్‌) కొడుకైన కేంద్ర మాజీ మంత్రి…

Read More

ప్రజాస్వామ్యమా నీవెక్కడ?

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. ‘ఓస్‌ ఇంతేనా ప్రజాస్వామ్యమంటే!’ అనే అభిప్రాయం కలిగేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని అరిష్టాల నడుమ కూడా రాజరికమైనా, కడకు నియంతృత్వమైనా నయమేమో అనిపించేంత అద్వాన్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. 146 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్షన్‌తో బయటకు పంపి, దేశానికి కీలకమయ్యే చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా ఓకే చేయించుకుంది. వాటిపై సమగ్ర పరిశీలన లేదు, అభ్యంతరాలు లేవు, చర్చ లేదు. నూటా యాబై సంవత్సరాలుగా…

Read More

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణమే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళి!

Nancharaiah merugumala senior journalist:  ఇందిరా గాంధీ హయాంలో వేళ్లూనుకున్న కుహనా సోషలిజాన్ని, రాజీవ్‌ గాంధీ పాలనలో బలహీన పడిన కుహనా లౌకికవాదాన్ని కూకటి వేళ్లతో పీకేసి ‘హిందూ’ మహాసముద్రంలో కలిపారు పాములపర్తి వేంకట నరసింహారావు గారు. ఈ తెలుగు అపర చాణక్యుడు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన 8 ఏళ్లకు అంటే–19 సంవత్సరాల క్రితం 2004 శీతాకాలంలో కన్నుమూశారు. దక్షిణాదికి చెందిన ఒకే ఒక బ్రాహ్మణ ప్రధానమంత్రిపై చరిత్ర తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది….

Read More

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…

Read More

లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు?

Loksabha2024: భారతదేశ రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదం రాతలకు, మాటలకే పరిమితమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కులం, మతం, ప్రాంతీయ అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఏయే వర్గాలతో ఎన్ని ఓట్లు పడతాయనే ధోరణితోనే పార్టీలున్నాయి. 2024 ఏప్రిల్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రధానమైన ముస్లిం ఓటర్లకు సంబంధించి చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్య్రానంతరం ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత రాజకీయాలు సుమారు 14 శాతమున్న ముస్లిం మైనార్టీల…

Read More

దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా భజన్ లాల్ శర్మ..

Nancharaiah merugumala senior journalist: ” ఇప్పుడు దేశంలో రెండో బీజేపీ బ్రాహ్మణ సీఎంగా రాజస్తాన్ లో గద్దెనెక్కబోతున్న భజన్ లాల్ శర్మ “ ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు 12 అనుకుంటే వాటిలో రెండింటిలోనే బ్రాహ్మణ నేతలు ముఖ్గ్యమంత్రులుగా ఉన్నట్టు లెక్క.బీజేపీ రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా ఇప్పుడు భజన్ లాల్ శర్మ వస్తున్నారు. మంగళవారం రాజస్తాన్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎంపికైన ఈ భజన్ శర్మ హిందీ ‘Heartland’ రాష్ట్రాల్లో బీజేపీ తరపున…

Read More

ఆర్టికల్ _370 రద్దుపై సుప్రీం కీలక తీర్పు..

Article370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని..రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని ఐదుగురు జడ్జీల ధర్మాసనం తేల్చిచెప్పింది. భారత దేశంలో కాశ్మీర్ విలినమైనప్పుడు  ప్రత్యేక హోదాలు లేవని .. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేవని  స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ హక్కుల విషయంలో ప్రత్యేకత ఏమిలేదని .. రెండు ఉద్దేశ్యాలు కోసమే ఆర్టికల్ 370 ఏర్పాటు అయ్యిందని తెలిపింది. కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం…

Read More

మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరు.. కాంగ్రెస్‌దే పైచేయి..!!

లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్కటైన మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఐదు…

Read More

పీపుల్స్‌ పల్స్‌ ఎక్స్ క్లూజివ్.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా..!

ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వరుసగా రెండోసారి  అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండడంతో పాటు భూపేష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవడంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీ నాయకుడిని తెరమీదకు తేవడంలో కేంద్ర బీజేపీ విఫలమవడంతోపాటు రాష్ట్ర పార్టీపై అధిష్టానానికి  పట్టు సడలడం వంటి…

Read More

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ ?

దేశంలో ఉత్తరాది ప్రాంతానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు సడలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంటే, ఇక్కడ పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు…

Read More
Optimized by Optimole