News
ఇండియా పేరును ఎఫ్.ఐ.సీ.ఆర్ అని మార్చుకోవచ్చనే ఆశ 50 ఏళ్ల క్రితం ఉండేదే!
Nancharaiah merugumala senior journalist: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్ట్ రిపబ్లిక్స్ (ఎఫ్.ఐ.సీ.ఆర్) అని మన దేశం పేరును మార్చుకోవచ్చని 1960ల చివర్లో, 1970ల ఆరంభంలో లక్షలాది మంది జనం అనుకునేవారు. ‘ప్రజా పోరాటాలు’ విజయవంతమయ్యాక నూతన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత ఉపఖండం యావత్తూ కొత్త బంగారులోకంగా మారుతుందని ఆశించేవారు. ఎఫ్.ఐ.సీ.ఆర్ అనే ఈ ప్రతిపాదిత పేరు నాటి అగ్రరాజ్యాల పేర్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్యే), యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యూఎసెసార్)కు…
జమిలి ఎన్నికల’ పై మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు బహిరంగ లేఖ..
Hyderabad: జమిలి ఎన్నికల’ పై మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాష్ రావు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ‘జమిలి ఎన్నికలు’ గురించి హడావుడి చేయడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు .బుధవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ప్రకాశ్ రావు మాట్లాడుతూ..నిజంగా ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సంస్కరణల…
అమర్ సింగ్ చేతిలో తన్నులు తిన్న అరవ బాపనాయనకు పీవీ పై కోపమెందుకు?
Nancharaiah merugumala senior journalist: (పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా?) ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్–వరంగల్ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని…
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పటేన్ల పటాతోపం..
బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలుగు రాష్ట్రాల్లో ‘‘రెడ్డి రాజుల’’ పాలన కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో లభించిన శాసనాల్లో రెడ్డి రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చింది. నది పరివాహక ప్రాంతాలను అసరా చేసుకొని సాగిన రెడ్డి రాజుల పాలనలో సాహసోపితమైన నిర్ణయాలు, వ్యవసాయ అభివృద్ది జరిగిందని చెబుతారు. ఆ నాటి నుంచి బలపడుతూ వస్తున్న రెడ్డిలు (పటేన్లు) ప్రస్తుత రాజకీయాల్లో కూడ అధిపత్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబరుస్తు వస్తున్నారు. ఆరు…
బాలెం గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్: ప్రిన్సిపల్ శైలజ
Suryapeta: సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్,బి జెడ్ సి,ఎం జడ్ సి సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఎస్సీ…
నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు..
Hyderabad: నవ్యనాటక సమితి 48వ ఆల్ ఇండియా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీల ముగింపు కార్యక్రమాలు రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. నవ్యనాటక సమితి సంస్థ నిరాటంకంగా ప్రతి సంవత్సరం కళాకారులను ప్రోత్సాహిస్తూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించిడమే నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యేక…
బటన్లు నొక్కడం కాదు… భవన నిర్మాణ కార్మికుల బతుకులకు భరోసా ఇవ్వండి: నాదెండ్ల మనోహర్
APpolitics: ముఖ్యమంత్రి బటన్లు నొక్కే కార్యక్రమం మానుకుని భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. వారానికి రెండు మూడు రోజులు మించి పనులు దొరక్కపోవడంతో ఆ కష్ట జీవులు పడే ఇబ్బందులను పాలకులు అర్ధం చేసుకోవాలన్నారు. పని కల్పించడమే ప్రభుత్వం నుంచి వారు కోరుకునే మార్పని తెలిపారు. జనసేన ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులను కాపాడుకునే విధంగా అన్ని విధాలా భరోసా…
రైతు బాంధవుడు.. ‘మహానేత’ స్మృతిలో..!
‘వైఎస్సాఆర్’ మాట వింటేనే తెలుగు ప్రజల మనస్సుల్లో ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆయనంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు ‘వైఎస్సాఆర్ పాలనలో’ అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా…
జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన స్వాగతిస్తుంది: నాదెండ్ల మనోహర్
Janasena: ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జమిలి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం అధికారికంగా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వృథా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్నారు. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమేనని.. రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్…
