దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అదృష్టం: రజినీకాంత్
2021 ఏప్రిల్ లో రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయంపై రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తన అదృష్టమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ట్వీట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంతోషకరమైన సమయంలో తన గురువు బాలచందర్ తనతో లేకపోవడం బాధాకరమని రజినీ అన్నారు.