దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్​ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు…

Read More

తీరుమారని ముంబై..లఖ్నవూ చేతిలో ఓటమి!

ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్​ రాత మారలేదు. శనివారం లఖ్​నవూ చేతిలో జరిగిన ఆరో మ్యాచ్లోనూ ముంబై జట్టు18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​ చేసిన లఖ్​నవూ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20ఓవర్లలో 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే, క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ తలా ఓ…

Read More

కోల్కతా చిత్తు..హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలను దూసుకెళ్తోంది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన పోరులో 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించి.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ రాణా (54) అర్ధసెంచరీ తో ఆకట్టుకోగా.. రసేల్ (49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2…..

Read More

టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన సంజయ్.. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ!

దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంగతి చూస్తామన్న ఆయన.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు సంజయ్‌ స్పష్టం చేశారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇమామ్‌పూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్లు వరకు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు…

Read More

ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హవా.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్‌ 2022లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. గురువారం రాజస్థాన్ తో జరిగిన పోరులో గుజరాత్ జట్టు 37 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (87 : 52 బంతుల్లో 8×4, 4×6) అర్ధ శతకంతో మెరిశాడు. అభినవ్ మనోహర్ (43 : 28…

Read More

పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు.. టోర్నీలో వరుసగా మూడో ఓటమి!

ఐపీఎల్ 15 వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 126 పరుగులకే చెన్నై చేతులెత్తేసింది. దీంతో 54 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఆ జట్టులో చలియామ్ లివింగ్ (60) స్టోన్ హాఫ్…

Read More

చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్!

ఐపీఎల్​ 2022లో టోర్నీలో వరుస ఓటములతో సతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గుడ్ న్యూస్. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ త్వరలో జట్టులో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు నెట్​ ప్రాక్టీస్​ సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా అతనిని చెన్నై జట్టు వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత సీజన్లో చెన్నై జట్టు విజేతగా నిలవడంలో దీపక్…

Read More

ఉగాది ముందస్తు వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఉగాది ముందస్తు వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలినని.. యాదాద్రి కి వెళ్ళాలని ఉన్న ఆహ్వానం అందలేదని.. సమక్క జాతరకు ఎవరూ పిలవకున్నా వెళ్ళానంటూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసిఆర్ తో పాటు మంత్రులు, సిఎస్, డీజీపీ హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక…

Read More

రసెల్ మెరుపులు.. కోల్ కత్తా సునాయస విజయం..!

ఐపీఎల్ 2022 టోర్నీలో కోల్‌కతా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించి.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కోల్ కత్తా బౌలర్ల ధాటికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో భనుక రాజపక్స (31) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కగిసో రబాడ (25) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా…

Read More

రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!

పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ…

Read More
Optimized by Optimole