ఆమె చేతిలో ఓడిపోతే రాజకీయాలు నుంచి తప్పుకుంటా: సువెందు అధికారి
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి సవాల్ విసిరారు బీజేపీ నేత సువేందు అధికారి. సోమవారం ఓ బహిరంగ సభలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె (మమతా బెనర్జీ)ఎన్నికల సమయంలో మాత్రమే నందిగామ్…
