వ్యూహకర్తలకు అంత సీన్ ఉందా? గెలిపించగలరా?

ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రశాంత్‌’ పేరిట మీడియా, సోషల్‌ మీడియాలో చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. మొన్నటిదాక బిగ్‌బాస్‌ ‘పల్లవి ప్రశాంత్‌’ సలార్‌ డైరెక్టర్‌ ‘ప్రశాంత్‌ నీల్‌’ పేర్లు వైరల్‌ అయితే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన రాజకీయ వ్యూహకర్త ‘ప్రశాంత్‌ కిశోర్‌’ వైరల్‌ అవుతున్నారు.  గతంలో బీఆర్‌ఎస్‌కు కూడా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముచ్చటగా మూడో పార్టీకి సలహాలు ఇవ్వడానికి  సిద్ధమయ్యారు. నిజంగా వ్యూహకర్తలు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలరా?…

Read More

రామ దీక్ష చేపట్టనున్న బండి సంజయ్‌ కుమార్‌?

BJPTELANGANA: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ కుమార్‌ రామ దీక్ష చేపట్టనున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌, విశ్వహిందూ పరిషత్‌ హిందూధార్మిక సంఘాలు ఇచ్చిన సలహా మేరకు బండి సంజయ్‌ దీక్ష చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు కాషాయం పార్టీలో చర్చ జరుగుతోంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో పార్టీ ముఖ్య నేతలు కూడా బండి సంజయ్‌తోపాటు రామ దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే దీక్షకు సంబంధించిన సన్నాహాలు సైతం…

Read More

“ఢిల్లీ ఓటు..నరేంద్రమోదీకే”..!

BJPtelangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా అస్త్ర శస్త్రాలను  సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోను సత్తచాటలని భావిస్తుంటే..ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలని పట్టుదలగా కనిపిస్తోంది. అటు బీజేపీ మోదీ చరిష్మా మీద నమ్మకంతో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే..  మరోవైపు పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో  ప్రజానాడి…

Read More

TV9 అధినేత వ్యాఖ్యలపై ఎడిటర్‌ రజనీకాంత్‌ జవాబివ్వరా?

Nancharaiah merugumala senior journalist: ‘నేను 2018లో తీసుకునే వరకూ టీవీ 9 ను నక్సలైట్‌ వ్యవస్థలా నడిపారు,’ అని …‘మైహోం’ జూపల్లి రామేశ్వర్‌ రావు గారు చెప్పాక కూడా మేనేజింగ్‌ ఎడిటర్‌ వెల్లలచెరువు రజనీకాంత్‌ జవాబివ్వరా? సోమవారం కడ్తాల్‌ మండలం మహేశ్వర మహా పిరమిడ్‌లో జరిగిన పత్రీజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో పాల్గొన్న మైహోం గ్రూప్‌ అధిపతి డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు గారు తెలుగు ప్రజలకు తెలియని ఓ కొత్త విషయం వెల్లడించారు. ‘2018లో నేను…

Read More

వంగవీటి రంగా హత్యానంతరం తెలుగు జర్నలిస్టులకు ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి..

Nancharaiah merugumala senior journalist: ” వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్‌ తెలుగు జర్నలిస్టులకు  ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి!” బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్‌ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్‌’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా…

Read More

దయానిధి మారన్‌ యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?

Nancharaiah merugumala senior journalist: ” దేవదాసీ కుల, కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్‌..యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?” ఉత్తరప్రదేశ్, బిహార్‌ నుంచి వచ్చిన ఇంగ్లిష్‌ రాని కార్మికులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుగున్నారని డీఎంకే లోక్‌ సభ సభ్యుడు దయానిధి మారన్‌ గతంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర నిరసనకు కారణమైంది. డీఎంకే నాయకుడు ఎం. కరుణానిధి మేనల్లుడి (అక్క కుమారుడు మురసోలి మారన్‌) కొడుకైన కేంద్ర మాజీ మంత్రి…

Read More

ఉండవల్లిని ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం!

Nancharaiah merugumala senior journalist: ఉండవల్లిని జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం! వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే మాసాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికల్లో కొందరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు నిరాకరించి, కొత్త అభ్యర్థులను నిలిపే దిశగా ఈ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆంధ్రా…

Read More

జగన్ తో షర్మిల ఢీ? ఏపి కాంగ్రెస్ కు ఆశాకిరణం..!

Appolitics :  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్‌ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్‌ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో…

Read More

Apelection: ఏపీ ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్లే కీలకం..

Apelection2024:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ పగ్గాలు ఖాయమని టీడీపీ- జనసేన కూటమి ధీమాగా ఉంది. రాష్ట్రంలోని పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటే, అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…

Read More
Optimized by Optimole