క‌విత వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు – బీఆర్ఎస్‌కు మ‌రింత న‌ష్టం చేసేలా స్కెచ్‌..!

Telangana: బీఆర్ఎస్ నుంచి సస్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై బుధ‌వారం మీడియాతో మాట్లాడిన క‌విత చివ‌ర్లో వ్యూహాత్మ‌కంగా “జై కేసీఆర్” నినాదాన్ని ఎత్తుకున్నారు. క‌విత ఈ నినాదాన్ని కాక‌తాళీయంగా చేసిన‌ది కాద‌ని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా నిన‌దించ‌డం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మ‌క అడుగులువేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.  కేసీఆర్‌పై గౌర‌వం…

Read Full News

Telangana: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైంది: మహేష్‌కుమార్ గౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. “కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా? లేక హరీశ్‌ రావా? అనేది మాకు సంబంధం లేదు. వారి హయాంలోనే స్కాం జరిగిందనేది కవిత మాటలతో రుజువైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే? కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్‌ వాటా ఎంత..?…

Read Full News

BRS: అవినీతి అనకొండలు హరీశ్–సంతోష్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు “అవినీతి అనకొండలు” అంటూ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ కు తిండి, డబ్బుల మీద ధ్యాస ఉండదు. కానీ ఆయన పక్కన ఉన్న వారివల్లే అవినీతి మరక అంటింది. నేడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను విమర్శించే పరిస్థితి రావడానికి కారణం హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి” అని కవిత ఆరోపించారు. ప్రస్తుతం…

Read Full News

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తు…!!

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో నియమించబడిన విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఆగస్టు 4న మంత్రివర్గం ఆ నివేదికను ఆమోదించి, శాసనసభ చర్చకు పెట్టింది. 665 పేజీలతో కూడిన నివేదికలో…

Read Full News

Telangana: డాడీ ఆశీర్వాదం కోసం..?

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత తన కుమారుడి ఆశీర్వాదం కోసం మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో కలవబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొడుకు పేరిట తెలంగాణ జాగృతి కమిటీల ఏర్పాటు ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగనుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ వర్గాల చర్చల ప్రకారం, ఇటీవల కవిత తెలంగాణ జాగృతి పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా సక్సెస్…

Read Full News

National: ఈసీ ‘ఈజీ’గా తీసుకోవద్దు..!!

Electioncommission: భారత ఎన్నికల సంఘం (ఈసీ) పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది. తన నిష్పాక్షితను నిరూపించుకొని స్వతంత్ర ప్రతిపత్తిని పునః ప్రకటించుకోవాల్సి ఉంది. తన నిర్వాకాలు సతతం రాజకీయ పక్షాలతోనే అయినా రాజకీయ మకిలి అంటకుండా పారదర్శకతతో ప్రజలకు విశ్వాసం కలిగించాలి. రాజకీయాలను సాకుగా చూపి విమర్శల్ని తేలికగా కొట్టేయడం కాకుండా తగు సమాచారంతో ఖండిరచాలి. విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు దుమారమే లేపాయి! నింద ఎంతో? నిజం ఎంతో? నిలకడగా తేలుతుంది. ఒక చోట్ల…

Read Full News

votechori: ఓటు దొంగలకు బుద్ది చెప్పడం ఖాయం..!

Telanganacongress: దేశంలో స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థలన్నీ పదకొండేళ్ల నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనలో గాడి తప్పుతున్నాయి. బీజేపీ అడ్డదారులను ఆసరాగా చేసుకొని అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే భ్రమల్లో ఉంది. ప్రజాగ్రహానికి మహారాజ్యాలే కుప్పకూలాయనే వాస్తవాలను గ్రహించలేని బీజేపీ నయానా భయానా వ్యవస్తలన్నింటినీ కబంధహస్తాల్లో బంధించి ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోంది. ఈసీ,ఈడీ, సీబీఐ ఇలా ప్రభుత్వ ఏజెన్సీలన్నింటినీ దుర్వినియోగపరుస్తూ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతోంది. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ నియంతృత్వ పోకడలకు ముకుతాడు…

Read Full News

Tollywood: Mayasabha Review…!!

Mayasabha Review: A Fictionalised Friendship Set Against Real Political Upheavals Rating: ★★★★☆ (4/5) By (anrwriting ✍✍✍) *Overview* Mayasabha, created by Deva Katta and directed by Kiran Jay Kumar, is an ambitious Telugu political drama that reimagines the early trajectories of two towering figures in Andhra Pradesh’s political history Chandrababu Naidu and YS Rajasekhara Reddy under…

Read Full News

కవిత ఫైర్‌: “జగదీష్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు!”

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారం మీడియాతో కవిత మాట్లాడుతూ..BRS పార్టీలోని ఒక ముఖ్య నేత, తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని…ఆ నాయకుడికి చెబుతున్నా… మీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముఖ్య నాయకుడి ఆదేశాలతోనే నాపై జరుగుతున్న దాడులపై…

Read Full News

Telangana: జన‘హితం’ పాదయాత్ర…!!

Telangana Congress: బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు (జనహిత పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో చేపట్టనున్న నిరసనల సందర్భంగా ప్రత్యేక వ్యాసం…) తెలంగాణలో సబ్బండ వర్గాల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రజలకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో ‘జనహిత’ పాదయాత్ర చేపట్టింది. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తూ ‘తెలంగాణ రైజింగ్’తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా…

Read Full News
Optimized by Optimole