టీ- కాంగ్రెస్ లో స‌రికొత్త ర‌చ్చ‌.. సీనియ‌ర్స్ VS జూనియ‌ర్స్‌..!

Tcongress: కాంగ్రెస్ లో ఎంపీ కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్యాలు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ అధికారంలోకి వస్తే ద‌ళిత వ్య‌క్తి సీఎం అవుతార‌ని మంచిర్యాల బ‌హిరంగ స‌భ‌ వేదికగా ఆయ‌న మాట్లాడిన మాట‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. దీనికి ఆజ్యం పోసేలా సీఎం రేసులో తాను ఉన్న‌ట్లు సీఎల్పీ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క్‌ బాంబ్ పేల్చ‌డంతో.. ‘ ఆలులేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోమ‌లింగం ‘ అన్న‌ట్లు హస్తం పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న…

Read More

మానుకొండూరులో ఏ పార్టీ స‌త్తా ఎంత‌? గెలిచేదెవరు?

Manakondur : క‌రీంన‌గ‌ర్ కూత‌వేటు దూరంలో ఉన్న మాన‌కొండూరులో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు ప‌ర్యాయాలు కొన‌సాగుతున్న‌ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ముచ్చ‌ట‌గా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్ ప‌రంగా బ‌లంగా క‌నిపిస్తున్న హ‌స్తం పార్టీ గెలిచేందుకు క‌స‌ర‌త్తుల‌ను ప్రారంభించింది. ఇక నియోజ‌క‌వ‌ర్గ ఎంపీగా కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. ఇక్క‌డ‌ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపి.. బిఆర్ఎస్ పార్టీని చావు…

Read More

‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేసీఆర్ కు భ‌ట్టి లేఖ‌..

BhattivsKCR: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని భ‌ట్టి లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో…

Read More

కాంగ్రెస్ ర‌థాన్ని గెలుపు తీరాల‌కు చేర్చి.. ప్ర‌జాసంక్షేమ పాల‌న‌కు శ్రీకారం చుట్టాల‌న్నదే భ‌ట్టి ల‌క్ష్యం..

“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాల‌ను పూర్తి చేసుకున్న అనంత‌రం విరాట‌ప‌ర్వం.. ఉత్త‌ర గోగ్ర‌హ‌ణంలో కౌర‌వ సేన‌మీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ‌, ద్రోణ‌, క‌ర్ణ‌, అశ్వ‌ర్థామ వంటి హేమాహేమీల‌ను మ‌ట్టి క‌రిపించి.. పాండ‌వ మ‌ధ్య‌ముడు జ‌య‌భేరీ మోగించాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజ‌కీయ ప‌రిస్థితులు త‌లెత్తాయి. దాదాపు ప‌దేళ్లుగా అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ పార్టీకి గాండీవ‌ధారిగా.. శ‌త్రు నిర్జ‌నుడిగా.. భ‌ట్టి విక్ర‌మార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్…

Read More

ప్రజాధనం ఎత్తుల్లో బరువుల్లో తూచడం వెనక ప్రజా ప్రయోజనాల కన్నా పాలక కుల ప్రయోజనాలే ముఖ్యం ..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మేధావులు, కవులు, రచయితల నుంచి భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పెద్దలు గుర్రం సీతారాములు గారు ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చదివేయండి. Gurramseetaramulu: ప్రపంచం  మొత్తం కరోనా పీడితమై చిక్కిశల్యం అవుతున్న కాలంలోనే ఈదేశం నర్మదానది ఒడ్డున ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అప్పు చేసి మరీ నిర్మించుకుంది….

Read More

ప్రాణ పదంగా ..పాదయాత్ర సమాహారం..

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పంచకట్టు. తలకు మూడు రంగుల పంచచుట్టి, కాళ్లకు బూట్లు వేసుకొని పాదయాత్ర కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను చూస్తే.. ప్రజలు, కాంగ్రెస్‌ వర్గీయుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తానని 2003లో వైఎస్‌ చేపట్టిన పాదయాత్ర రీతిలో నేడు భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవిలో నివాసముంటున్న గిరిజన తండాలు, పెంకుటిల్లు లేని పూరి గుడిసెల్లో జీవిస్తున్న వారి వ్యధ, పోడు భూముల కోసం ఆశగా ఎదురు చూస్తున్న గిరిజనల గోసను, వారి…

Read More

మంచిర్యాలలో సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి..

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాల చేరుకున్న సందర్భంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. మంగళవారం సభా ప్రాంగణం…

Read More

కేసిఆర్ రాష్ట్రాన్ని అమ్మేసిన అమ్మేస్తాడు: సీఎల్పీ విక్రమార్క

Mancherial : సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది.  పాద‌యాత్ర‌లో భాగంగా భ‌ట్టి.. సీఎం కేసీఆర్ పై  తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా..  పదివేల కోట్లు ఖర్చుతో చేప‌ట్టిన‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిప‌డ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్  పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రని ఆగ్ర‌హం…

Read More

జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎల్పీ భట్టి విక్రమార్క..

Mancherial :మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈనేప‌థ్యంలోనే బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి.. వారి హ‌క్కుల కోసం పోరాడి..సాధికార‌త క‌ల్ప‌న‌కు కృషి చేసిన మ‌హాత్మా జ్యోతిబా పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆమ‌హానీయుడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు భ‌ట్టివిక్ర‌మార్క‌. ఈకార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి, జిల్లా అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌,…

Read More

Jadcherla: క‌దంతొక్కిన రైత‌న్న‌లు..రైతు ద‌ర‌ఖాస్తుల‌ను త‌హాశీల్దార్ కు అంద‌జేసిన అనిరుథ్..

jadcherla :జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్ రెడ్డి చేప‌ట్టిన రైతు ద‌ర‌ఖాస్తు ఉద్య‌మానికి అనూహ్య ప్ర‌జాస్పంద‌న ల‌భించింది. తెలంగాణ‌లో తొలిసారిగా చేప‌ట్టిన ఈఉద్య‌మానికి రైత‌న్న‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క రాజాపూర్ మండ‌లంలోనే ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికి పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. దీంతో సేక‌రించిన ద‌ర‌ఖాస్తుల‌ను రైత‌న్న‌ల‌తో క‌లిసి అనిరుధ్ భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి .. మండ‌ల కార్యాల‌యంలో త‌హాశీల్దార్ కు అంద‌జేశారు. రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌ను గౌర‌వ‌ముఖ్య‌మంత్రి కేసీఆర్ , వ్య‌వ‌సాయ శాఖ…

Read More
Optimized by Optimole