మూడింట రెండొంతులు ఇంకా బాకీ..!

కొన్ని సంవత్సరాల తర్వాత దేశ ప్రజల దృష్టిని బాగా ఆకర్శించిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యక్రమం ‘భారత్‌ జోడో’ యాత్ర ముగిసింది. పార్టీ ముఖ్య నాయకుడు, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇచ్చిన కుటుంబపు వ్యక్తిగా రాహుల్‌ గాంధీ ఒక పరీక్ష నెగ్గారు. నిందో, నిజమో తెలియకుండా… ఇన్నాళ్లు రాహుల్‌ పై ఉన్న ఒక విమర్శ తొలగిపోయి, వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. ఆయన స్వభావం, వ్యవహార శైలిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు…

Read More

తెలంగాణలో బీజేపీకి అధికారం కలేనా…?

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామని పగటి కలలుకంటూ క్షేత్రస్థాయిలో వాస్తవికతను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర బీజేపీ ఢల్లీి హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నా ఢల్లీి పెద్దలు మాత్రం వాటిని పూర్తిగా విశ్వసించక ఆచితూచి అడుగులేస్తున్నారు. అందుకే రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా పార్టీ అధిష్టానం రాష్ట్రంలో విడతలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేస్తూన్నా ఇక్కడి లీడర్లు మాత్రం పగటికలలతో ఊహాలోకంలో ఉంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ…

Read More

ప్రచారంలో Hindutva ను దాటిపోతున్న Hindenburg..

Nancharaiah merugumala 🙁 senior journalist) ================== H (ఎచ్/హెచ్) తో మొదలయ్యే మాటల్లో Hindutva తర్వాత ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న మాట Hindenburg (హిండన్ బర్గ్). జర్మన్ సంస్థకు చెందిన ఎయిర్ షిప్ హిండన్ బర్గ్ (1937 ప్రమాదంలో అమెరికా న్యూజెర్సీలో కూలిపోయింది) పేరుతో అమెరికాకు చెందిన నాథన్ (నేట్) ఆండర్సన్ స్టాక్ మార్కెట్ పరిశోధనా సంస్థ నెలకొల్పి, ప్రపంచం కుబేరుల్లో మూడో స్థానం సంపాదించిన భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ…

Read More

కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు…

Read More

తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు…

Read More

నల్గొండ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రావు IPS

నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి రామగుండం సి.పి గా బదిలీపై వెళ్ళారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం..జిల్లా ఎస్పీ కార్యాలయంలో అపూర్వ రావు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు.. ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పంగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర…

Read More

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బిజేపి స్టేట్ చీఫ్ బండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. మహిళలను నేరుగా కలిసి.. ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోవాలని సూచించారు….

Read More

లైంగిక బాధిత మ‌హిళ‌లకు తక్షణ ఆర్ధిక సహాయం: ఎస్పీ రెమా రాజేశ్వరి

న‌ల్ల‌గొండ‌:  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా .. లైంగిక వేధింపుల ద్వారా మోస‌పోయిన  మ‌హిళ‌లకు  పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో త‌క్ష‌ణ‌ ఆర్థిక స‌హాయం అంద‌జేశామ‌న్నారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. బాధిత మ‌హిళ‌లకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ .. ప్రజలకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించిన ఎస్పీ.. 10 మంది మ‌హిళ బాధితుల‌కు.. ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందన్నారు. బాధిత…

Read More

ప్రజాస్వామ్యానికి పునాది “ఓటు” : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట‌: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ “ఓటు” కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి పునాది ఓట‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.సూర్యాపేట జూనియ‌ర్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన‌ జాతీయ ఒట‌ర్ల దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ గతిని మార్చగల శక్తి” ఓటు ” కు ఉంద‌న్నారు..ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి.. వ్యవస్థ మార్పు కు నాంది పలికేదే “ఓటు” అని గుర్తుచేశారు. ప్ర‌జానాయ‌కుడిని ఎన్నుకొవ్వాలంటే 18 ఏళ్లు నిండిన యువత…

Read More

కొండ‌గ‌ట్టులో ప‌వ‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన అభిమానులు ,కార్య‌క‌ర్త‌లు..

జ‌గిత్యాల‌: తెలంగాణ ప్ర‌ముఖ పుణ్యంక్షేత్రం కొండ‌గ‌ట్టు ఆల‌యాన్నిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌ర్శించారు. ఆలయ అధికారులు పవన్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఆంజ‌నేయ  స్వామి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయించారు.ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి.. సింధూరంతో శ్రీరామదూత్ అని ప‌వ‌న్ రాశాడు. ప్రారంభసూచకంగా వాహనాన్ని న‌డిపాడు. ఇక ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ..జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ,నేత‌లు.. కొండ‌గ‌ట్టుకు భారీగా…

Read More
Optimized by Optimole