ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ పుల్ జట్టు ఎదంటే సగటు క్రికెట్ అభిమానికి గుర్తొచ్చే పేరు చెన్నె సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో ప్లే ఆఫ్ చేరడంతో .. విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆజట్టుకు ఉన్న అభిమానులు సైతం మరో జట్టుకు లేదనడంలో సందేహం లేదు. సీఎస్కే అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని. సీఎస్కే అభిమానులు పిలుచుకునే పేరు తల. ఒక్క మాటలో చెప్పాలంటే ధోని అభిమానులే సీఎస్కే అభిమానులు అన్నంతగా అభిమానం తయారైందంటే.. టీంఇండియా మాజీ కెప్టెన్ క్రేజ్ ఏరేంజ్లో ఉందో అర్థమవుతోంది.
ఇప్పుడు సీఎస్కే ప్రస్తావన ఎందుకంటారా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్కి చెందిన ఇండియా సిమెంట్స్ కి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో చెన్నై జట్టు సారధి ధోనీ, యజమాని శ్రీనివాసన్ ఐపీఎల్ ట్రోఫీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అందించారు. ఈసందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ధోనిని ప్రశంసలతో ముంచెత్తారు. ధోనీ జార్ఖండ్ కు చెందినవాడే అయినా తమిళనాడు ప్రజల కోసం వచ్చినట్టుందని వ్యాఖ్యానించారు. ధోనీ కూడా తమిళ ప్రజానీకంలో ఒకడిగా మారిపోయాడని పేర్కొన్నారు. మరెన్నో సీజన్లతో పాటు చెన్నై జట్టుకు నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ కు చెన్నై జట్టు ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని కానుకగా అందించారు. ఆ నెంబర్ 7 జెర్సీపై ‘ఎంకే స్టాలిన్’ అని రాసి ఉండడం విశేషం.
ఇక చెన్నై జట్టు సారథి ధోనీ మాట్లాడుతూ.. వయసు మీద పడిన .. తనలో సత్తా ఇంకా మిగిలే ఉందని అన్నాడు. ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ ను చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆడతానని స్పష్టం చేశారు. తద్వారా 2022 ఐపీఎల్ లో ఆడతానని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. చెన్నై ప్రజలు ఎంతో సహృదయులని, గతంలో సచిన్ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్ తరఫున చివరి మ్యాచ్ ను చెపాక్ లోనే ఆడాడని.. అప్పుడు ప్రేక్షకులు నిలబడి మాస్టర్ కు అభివాదం చేశారని ధోనీ గుర్తు చేశాడు. ఈ వేడుకలో మరో విశేషం ఏంటంటే.. చెన్నై జట్టు గతంలో గెలిచిన ఐపీఎల్ ట్రోఫీలను వేదికపై ప్రదర్శించడం.