Bollywood:
దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటూ ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇటీవల ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో హీరో జునైద్ ఖాన్, ఆయన తండ్రి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్తో కలిసి సాయిపల్లవి సందడి చేశారు. సాధారణంగా గ్లామర్ కంటే పాత్ర ప్రాధాన్యానికే విలువిచ్చే సాయిపల్లవి, ఈ కార్యక్రమంలో కూడా తన సాదాసీదా శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు.
‘ఏక్ దిన్’ చిత్రానికి మరో విశేషం ఏమిటంటే, ఇది జపనీస్ క్లాసిక్ చిత్రం Love Letter ఆధారంగా రూపొందడం. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ ప్రేమ, జ్ఞాపకాలు, అనుబంధాల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్ స్పష్టంచేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్నిస్తోంది.
జునైద్ ఖాన్కు కూడా ఈ చిత్రం కెరీర్ పరంగా కీలకంగా మారనుంది. ఆమిర్ ఖాన్ వారసుడిగా కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఆయనకు సాయిపల్లవి వంటి స్టార్ హీరోయిన్ తో నటించడం అదనపు బలం.
సాయిపల్లవి కెరీర్ను పరిశీలిస్తే, ఆమె ఎప్పుడూ భిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు. కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా నిలిచి, నటనకు అవకాశమున్న కథలనే ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. అదే ధోరణిని బాలీవుడ్లో కూడా కొనసాగిస్తారా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో కనిపిస్తోంది.
మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఏక్ దిన్’ చిత్రం, సాయిపల్లవికి బాలీవుడ్లో బిగ్ బ్రేక్ అవుతుందా? జునైద్ ఖాన్కు స్టార్ ఇమేజ్ను అందిస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం ప్రేక్షకులే సమాధానం చెప్పాలి.
