ఐసీసీ ర్యాంకింగ్స్.. తొలిసారి టాప్ 20 లోకి శ్రేయాస్..!

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్సమెన్ శ్రేయాస్ అయ్యర్‌ తొలిసారిగా టాప్ 20లోకి దుసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకటుకున్న శ్రేయాస్.. 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టాప్-10లో ఉన్న విరాట్ కోహ్లీ 10వ స్థానం నుంచి పడిపోయి 15 వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ 805 పాయింట్ల తో అగ్ర స్థానంలో ఉండగా, మహమ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో రెండు, దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ మర్ క్రమ్ 796 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు స్థానాలు ఎగబాకి.. 17వ ర్యాంక్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తొమ్మిది.. బంగ్లాదేశ్‌కు మెహదీ హసన్ ఏడో స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 737 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 709 పాయింట్లతో ఆస్ట్రేలియా జోష్ హాజెల్ వుడ్ రెండో స్థానంలో.. 700 పాయింట్లతో ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Optimized by Optimole