ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ . విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ అత్యంతభారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రస్తుతం పార్ట్_1 షూటింగ్ చివరి దశలో ఉన్న తరుణంలో చిత్ర బృందం విడుదల తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాక ఈ సినిమా లో నటిస్తున్న ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తీ ఫస్ట్ లుక్ల్ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా తమిళంతోపాటు మరో నాలుగు భాషల్లో విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ మూవీకి.. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కెమెరా మెన్గా రవి వర్మన్, ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.