Telangana election2023: కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ “కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్న 407 పోలింగ్ బూత్ లకు బాధ్యుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. 24వ తేదీన నియోజకవర్గ పరిధిలోని జనసేన, బీజేపీ ప్రతినిధుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని స్పష్టం చేశారు.26వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసి జనసేనాని కూకట్ పల్లి బహిరంగ సభలో పాల్గొంటారని ..ఈ సభను జన సైనికులు, వీర మహిళలతోపాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మనోహర్ కోరారు.