జగిత్యాల: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవలే మాపార్టీ అధినేత కేసీఆర్ ను కాళేశ్వరం పేరిట విచారించింది.ఇప్పుడు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తోంది. మేము కేసులకు భయపడే వాళ్లం కాదు. విచారణ పేరిట తెలంగాణ భవనన్ కు తాళం వేయడం దుర్మార్గ చర్య. ప్రజల దృష్టి మరల్చేందుకు ఏసీబీ విచారణ అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. మా పార్టీ నేతలను, కార్యకర్తలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం దారుణమని కవిత అన్నారు.
జగిత్యాల పర్యటనలో భాగంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
అధికార కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకసారి మాత్రమే రైతుభరోసా ఇచ్చింది. అందులో 60 శాతం మంది రైతులకే లబ్ధి చేకూరింది. మిగిలిన 40 శాతం మందికి రైతుభరోసా ఎప్పడు ఇస్తారో చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలివి కానీ హామీలిచ్చి కాంగ్రెస్ పార్ఠీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నర పాలనలో రైతుభరోసా తో సహ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసింది. హామీలన్ని ఎగవేసి..ప్రశ్నిస్తున్నందుకే మాపార్టీ నేతలను విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. మా పార్టీలోని లోపాలను భూతద్దంతో చూడాల్సిన పనిలేదు. అధినేతతో చర్చించి లోపాలను సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం.ఉడుత ఊపులకు భయపడేది లేదు అంటూ కవిత తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు.