నేలపట్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
యాదాద్రి _ భువనగిరి: నేలపట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కు చెందిన 1997_98 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్దులు.. ఉపాధ్యాయులకు శాలువా కప్పి , సరస్వతి దేవి జ్ఞాపికతో సన్మానించారు. విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.తమ విద్య, వైవాహిక జీవిత విశేషాలను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.
బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట: జాతీయ స్థాయిలో బిజెపి ని ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి . నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నదన్నారు.ఇక్కడి గల్లీ కాంగ్రెస్ నాయకత్వం తో ఆ పార్టీ క్యాడర్ విసిగిపోయారని ఆయన చెప్పుకొచ్చారు.అభివృద్ధి, ఎజెండా లు ఏమి లేకుండా బూత్ మాటలకే గల్లీ నాయకులు పరిమితం కావడంతో ఆ పార్టీ క్యాడర్ బి ఆర్ యస్ లోకి బారులు తిరుతున్నారన్నారు. సూర్యపేట పురపాలక…
వై.యస్. వివేకానంద హత్య కేసు దృష్టి మరల్చేందుకే పట్టాభి అరెస్ట్: ఎంపి రఘురామ
మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు పథక రచన చేసిన సూత్రధారులు ఎవరో తేలిపోయిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఈ హత్య వెనుక అల్టిమేట్ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తేలాల్సి ఉందని అన్నారు. హత్యకు పథక రచన చేసిన వారికి పెద్ద మొత్తం సొమ్మును ఏర్పాటు చేస్తామని ఎవరైనా గాడ్ ఫాదర్ చెప్పారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హత్య చేసిన వారు ముందే దొరికారని, ఇప్పుడు లెవెల్ వన్…
చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్..!
Nancharaiah merugumala: (senior journalist) అమెరికా సిటీ సియాటల్ లో చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్ పుణెలోని సొంత ఇంట్లో 44 ఏళ్ల నాటి కుల వివక్షను మరవని గొప్ప మహిళ! ఈ వాయువ్య అమెరికా నగరంలో ఇక ముందు ప్రకటిత కులద్వేషం నేరమే! కుల వివక్షకు, కులతత్వానికి పేరుమోసిన తమిళ బ్రాహ్మణ సమాజంలోని ఓ కుటుంబంలో పుట్టిన క్షమా సావంత్ నేడు అమెరికాలో సాంఘిక విప్లవానికి నిలువెత్తు స్తంభంగా నిలబడింది. వాయువ్య…
