ఏపీలో ఎమ్మెల్సీ సీటు కోసం జర్నలిస్టుల కుస్తీ..?
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోటిచేసే అభ్యర్థులతో పాటు ఆశావాహుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు అవకాశం కల్పించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన తెలుగు చానళ్లలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వీరేకాక రిటైరైన జర్నలిస్టులు.. జగన్ సొంత మీడియాలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి వ్యక్తి, ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్న పేరున్న జర్నలిస్ట్ సైతం టికెట్ కోసం…
దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!
దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు…
TSAT: యువతకు దిక్సూచి టీ-సాట్..!
T- SAT: సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి యుగంలో టీ-సాట్ ఆధునిక టెక్నాలజీతో తెలంగాణలోని అన్నివర్గాలకు చేరువవడమే కాకుండా, ఒక వరంగా మారింది. ప్రస్తుత కాలంలో అన్ని అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు, యువతకు, మహిళలకు, రైతులకు ఇలా అందరికీ టీ-సాట్ చేదోడుగా ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఇంటింటికీ దగ్గరవుతుంది. ఆధునికానికి అనుగుణంగా టీ-సాట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అన్ని రంగాల్లో విస్తరించేలా…
పోర్న్ రాకెట్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి!
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్ ను తొలగించడంతో.. కుంద్రా ప్లాన్-బి అమలుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ వినియోగానికి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారి పేరు మీద.. అతడికి తెలియకుండానే భాగస్వామిని చేసినట్లు తేలింది. ప్రస్తుతం…
ఆంధ్రప్రదేశ్లో పొత్తుల పోరు …
ఎన్నికలకు ఏడాది ముందరే పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్ కల్యాణ్! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…
మాఘ పురాణం – 16 వ అధ్యాయము
విద్యాధరపుత్రిక కథ : రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ “నాయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపమునకు మెచ్చి, పుత్రిక ననుగ్రహించుచున్నానని” యంతర్దానమునందెను. ఆమె…
జనగాం బీఆర్ఎస్ లో ముసలం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..
Telanganapolitics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగాం టిఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా బి ఆర్ ఎస్ నాయకులతో హైదరాబాద్ టూరిజంలో సమావేశమయ్యారు. అనూహ్యంగా టూరిజంలో ఎమ్మెల్యే ప్రత్యక్షమవడంతో అవాకవ్వడం నేతలవంతయింది. కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. సమావేశానికి ఎవరెవరు వచ్చారో తెలుసుకుందామని మాత్రమే వచ్చినట్లు తెలిపారు.ఇలాంటి అనైతిక చర్యలను పార్టీ అధిష్టానం ఉపేక్షించదని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని…