వణికిస్తోన్న ఒమిక్రాన్..ఒక్కరోజే 16 కేసులు!
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్…. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే భారత్లో అత్యధికంగా 16 కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్లో నాలుగు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో ఎనిమిది కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 7 కేసులు ముంబైలో.. మరో కేసు వాసాయి విహార్ శివారులో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి మహరాష్ట్రలో కేసుల సంఖ్య 28కి చేరింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57…