కరీంనగర్ లో వింత పాము..?

కరీంనగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పామును చూసిన గ్రామస్తులు లు భయాందోళనలకు గురవుతున్నారు. పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరోవైపు జిల్లా స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఈ విషయం పై స్పందించారు. ఇదంతా అబద్దమని పేర్కొన్నారు. నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్…

Read More

పురాణాల అంటే ఏమిటి? విశిష్టత ఏంటి?

‘పురాణ’శబ్దం యొక్క వ్యుత్పత్తి పాణిని అష్టాధ్యాయిలోను .. యాస్కుని నిరుక్తంలోను మరియు పురాణాలలో కూడా కనిపిస్తుంది. పాణిని చెప్పిన ప్రకారం ‘ పురాభవమ్ ‘ అంటే ప్రాచీనకాలంలో జరిగినది. పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. పురాణాల  లక్షణాలు:  1) సర్గం 2) ప్రతిసర్గం 3) వంశం 4) మన్వంతరం 5) వంశాను చరితం పురాణానికి…

Read More

బ్రిటన్లో కరోనా కొత్త రకం డెల్టా స్ట్రెయిన్!

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డెల్టా వేరియంట్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌ కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెల్టా రకం సోకిన వారికి రెండు టీకాలు అందించటం ద్వారా రక్షణను పొందవచ్చని ఆయన చెప్పారు. మెుదటి డోసు తీసుకున్న వారందరూ…

Read More

కరోనాతో మరో వింత వ్యాధి..!

కరోనా మహమ్మారి శరీరంలోని ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది. కొవిడ్​ బారిన పడిన వారికి.. బ్లాక్ ఫంగస్​, వైట్ ఫంగస్ ముప్పు ఉందని తేలిన నేపథ్యంలో పేగులపై ప్రభావం చర్చనీయాంశం అయ్యింది. పేగుల పై ప్రభావం వలన.. గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. పేగులను…

Read More

చనిపోయిన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు…!

కరోనా మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఎవరికైనా వైరస్ సోకితే చాలు సొంత కుటుంబ సభ్యులను దూరం పెడుతున్నారు. ఇక కరోనా తో మరణిస్తే చివరి చూపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గజరాజు తనను సాకిన మావటి చనిపోతే.. చూసేందుకు 22 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యం అయ్యింది. గజరాజు దుఃఖాన్ని చూసి.. అక్కడి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కేరళలోని…

Read More

ఐపీఎల్ 20 21 సెకండ్ షెడ్యూల్ కి అంతా సిద్ధం!!

కరోనా మహమ్మారి కారణంగా అర్దాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ 2021 మిగతా మ్యాచ్ల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది. ఇందుకోసం బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ సహా ఇతర అధికారులు ఇప్పటికే కీలక చర్చలు జరిపారు. బీసీసీఐ అడిగిన ప్రతీ అంశానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. 25 రోజుల్లోనే 31 మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ…

Read More

భారతీయ టేకీలకు గుడ్ న్యూస్!

అమెరికాలో నివసించే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్​న్యూస్. హెచ్ వన్ బి వీసాల ల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గ్రీన్​కార్డుల జారీలో ఉన్న దేశాల వారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదనకు యూఎస్​ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారతీయులకే అధిక ప్రయోజనం చేకూరనుంది. జో లోఫ్​గ్రెన్​, జాన్​ కర్టిస్ అనే ఇద్దరు సభ్యులు ‘ది ఈక్వల్​ యాక్సెస్​ టు గ్రీన్​ కార్డ్స్ ఫర్​ లీగల్​ ఎంప్లాయిమెంట్​ (ఈఏజీఎల్​ఈ) చట్టం–2021’ను…

Read More

కోవిడ్ బాధితుల డబ్బులు తిరిగి ఇప్పిస్తాం: వైద్య ఆరోగ్య శాఖ

కోవిడ్ బాధితుల నుంచి డబ్బులు దండుకుని ప్రభుత్వ ఆసుపత్రులపై చర్యలు ముమ్మరం చేశారు. హైకోర్టు సూచనల ఆధారంగా.. బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పిచ్చేందుకు కసరత్తు మొదలైంది. కరోనా రోగులకు చికిత్స పేరిట దోపిడీకి పాల్పడిన ఆసుపత్రులపై పది రెట్లు జరిమానా విధించాలని.. వాటిపై చర్యలు తీసుకోవడం కన్నా.. వసూలు చేసిన సొమ్మును బాధితులకు ఇప్పించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య శాఖ స్పందించింది. ఇప్పటికే రోగుల నుంచి 114 ఆసుపత్రులపై 185…

Read More

కోవిడ్ తో వేలమంది బాలలు అనాధలు!

దేశంలో కోవిడ్ వలన అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. వేల మంది కరోనా కాటు గురై మరణించారు. తద్వారా.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి.. అనాథలైన బాలలు ప్రస్తుతం వేలమంది. కరోనా కారణంగా 1,882 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలైనట్లు జాతీయ బాలల హక్కుల సంఘం వెల్లడించింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 7,464 మందిగా..సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంఘం వివరాలను పేర్కొంది. ఏడాదిన్నరగ.. కొవిడ్‌ కారణంగా 9,346 మంది పిల్లలు ఏదోరకంగా…

Read More

చిన్నారుల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎంత..?

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ పై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్‌లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. వైరస్‌ ప్రవర్తనలో మార్పులు వస్తే మాత్రం చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండడంతో పాటు.. థర్డ్ వేవ్ పరిస్థితులును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ వైరస్‌ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టామని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా పిల్లలకు వైరస్‌…

Read More
Optimized by Optimole