TirupatiLaddu:చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం చేయడం ఏమన్నా బాగుందా..?
Nancharaiah merugumala senior journalist:: జంతుకొవ్వు సంగతి సరే, వంటి మీద మూడొంతులు బట్టలు లేకుండా చెమటలు కక్కే మనుషులు వెంకన్న ప్రసాదం లడ్డూలు చేయడం ఏమన్నా బాగుందా? పవిత్ర హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయంలో కనిపించే అపరిశుభ్రతను చూసి మహాత్మా మోహన్ దాస్ గాంధీ ఎంతగానో నొచ్చుకునేవారు. మందిరాల్లో మురికిని, శుచీశుభ్రంలేని పరిస్థితులను ఆయన పదేపదే ఎండగట్టేవారు. తనకు స్వాతంత్య్రం కన్నా పరిశుభ్రతే ముఖ్యమని బాపూ నొక్కిచెప్పేవారు. తెల్లారి లేస్తే గాంధీ పేరు…