Telangana: టచ్ చేసి చూడు..బట్టలూడదీసి కొడతారు కేటీఆర్: టీపీసీసీ మహేష్ గౌడ్

Tpccmaheshgoud: కేటీఆర్ పై టీపీసీసీ(TPCC )అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్‌ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అని.. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా బుద్ధి రాలేదని అన్నారు. కేటీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2025 – 26 శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్…

Read Full News

janasena: న భూతో న భవిష్యతి అనేలా ఆవిర్భావ సభ: నాదెండ్ల

Janasena: ‘పిఠాపురం జనసేన పార్టీకి ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు కూడా పిఠాపురం వేదిక అయింది. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్పుకొందాం.. థాంక్యూ పిఠాపురం’ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్  అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో…

Read Full News

Telangana: విద్యా సంస్థలలో ‘ఈ’ ఆఫీసు ఆవశ్యకత..!

Telangana: మన తెలంగాణ రాష్ట్రం ఐ.టి. రంగంలో అగ్రగామిగా పేరు గడించింది. ఐ.టి. రంగంలో దేశంలో తలమానికంగా ఎదుగుతున్నది. కోట్లాది రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను చేస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. భాగ్యనగర కాంతులను విరజిమ్ముతుంది. ఐతే కాంతి రేఖలు నగరాల నుండి అనేక రంగాలకు వెదజల్లాలి అప్పుడే ఆధునిక సాంకేతికత దన్నుతో నూతన జవసత్వాలతో ప్రగతి పతాక ఎగురుతుంది. ఐ.టి.. విద్యారంగంలో వెలుగులు పూయించాలి. ఇప్పటి అనేక ఆఫీసుల్లో ముఖ్యంగా విద్యారంగంలో రాతపూతల పని…

Read Full News

Telangana: వేడెక్కనున్న తెలంగాణ రాజకీయాలు..!

Telangana: తెలంగాణలో వేసవి వేడితో పాటు రాజకీయాలు కూడా వేడెక్కబోతున్నాయి. 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ టైం ముగిసింది. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు పరీక్షగా టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అంతర్గతంగా ఉన్న సవాళ్లపై మరింత స్పష్టత కూడా రానుంది. కరీంనగర్, నిజామాబాద్,…

Read Full News

BRS: మహిళా దినోత్సవం లోపు హామీల అమలుపై కార్యాచరణ ప్రకటించాలి: కవిత

Telangana : కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం నాడు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీల పై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు.ఈ…

Read Full News

AAP : కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిందా..?

Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచుకోటకు బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానాలతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు….

Read Full News

Telangana: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం..!

Telanganacongress: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు 2025 ఫిబ్రవరి 4వ తేదీ చారిత్రాత్మక దినోత్సవం. జనాభాలో సగానికిపైగా ఉన్నా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్న బీసీలకు సరైన న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో ముందడుగు వేసింది. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రాధాన్యతివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ఎన్నికల ముందే కార్యాచరణ రూపొందించి 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు కృషి చేస్తోంది….

Read Full News

Delhi election2025: బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు: పీపుల్స్ పల్స్

Peoplespulse: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండనుంది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్…

Read Full News
Optimized by Optimole