సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.’ గీతా గోవిందం ‘ఫేం పరశురామ్ దర్శకుడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్.. మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన.. పెన్ని సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.8 కోట్ల మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
కాగా సర్కారు వారి పాట చిత్రం నుంచి రెండవ పాటగా వచ్చిన ఈ పెన్నీ వీడియో సాంగ్ ద్యారా మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తొలిసారి సిల్వర్ స్క్రీన్పై మెరిశారు. మహేష్.. సితారను ఒకేపాటలో చూడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.