బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read More

సామాజిక పింఛన్లను తొలగించడం హేయం: జనసేనాని

ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు  కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య  పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు  చూపించిన కారణాలు సహేతుకంగా లేవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పింఛన్ల…

Read More

కాపులు ఎవరు? వారి జనసంఖ్య ఎంత? ‘రాజ్యాధికారం’ ఎప్పుడొస్తుంది?

Nancharaiah merugumala:(senior journalist) కాపులు ఎవరు? కాపు, బలిజ, తెలగ, ఒంటరి (కేబీటీఓ) సముదాయం జనం ఎంత మంది? కాపులకు ఇప్పుడు అసలు ‘రాజ్యాధికారమే’ లేదా? కాపు సంస్కృతి అనేది ఉందా? ఈ విషయాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (USA) చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) లేదా మసాచూసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణులతో అధ్యయనం చేయిస్తే బావుంటుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ఎవరైనా ఈ సలహా…

Read More

విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చవద్దు: పవన్ కళ్యాణ్

విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విద్యాలయాల ప్రాంగణాలను..  సీఎం జగన్ ఫ్లెక్సీలతో  నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందన్నారు. సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన్నారు జనసేనాని. ఇక తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ…

Read More

పన్ను వసూలు పేరుతో అధికారులు బెదిరిస్తున్నారు: మనోహర్

ఏపీ లో ఖాళీ స్థలాల పేరు చెప్పి సామాన్యులను  పన్ను వసూలు పేరుతో మున్సిపాలిటీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. ఖాళీ స్థలాల్లో బోర్డులుపెట్టి హెచ్చరించడాన్ని కచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత కబ్జాలుగా భావిస్తున్నామన్నారు.ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను కాపాడే ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారిగా, కబ్జాకోరుగా మారడానికి వైసీపీ నాయకత్వమే కారణమని మనోహర్ మండిపడ్డారు. కాగా  సీఎం జగన్  ఆలోచనకు అనుగుణంగానే మున్సిపల్  అధికారులు నడుచుకొంటున్నారేమోని?..ఇంటి…

Read More

వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్

సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…

Read More

అన్నదాత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: నాదెండ్ల మనోహర్

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.  వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని.. వారిలో మానవత్వం లేదని మనోహర్ మండి పడ్డారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి…

Read More

మాచర్ల ఘటనను ఖండిస్తున్నా : నాదెండ్ల మనోహర్

మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని…

Read More

జగన్మోండిపై జనసేనాని బ్రహ్మస్త్రాలు..

  ఒక్క ఫొటో వేల మాటలతో సమానం అయితే, ఒక్క కార్టూన్‌ లక్షలమంది భావోద్వేగాలను చూపించే సాధనం. అక్షరం చిత్రంతో కలిసినప్పుడు అది బతుకు చిత్రానికి ప్రతీకే అవుతుంది.  నలిగిపోతున్న ఆంధ్ర ప్రజల బతుకు చిత్రాన్ని,  విరిగిపోయిన ఏపీ అభివృద్ధి రథాన్ని, పెరిగిపోతున్న వైసీపీ నియంతృత్వ పోకడను అలాంటి కార్టూన్‌ అస్త్రంతో ఎదుర్కొంటోంది జనసేన. గత ఆరేడు నెలలుగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తో పాటు, జనసేన అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వంపై సంధిస్తున్న కార్టూన్లు ఏపీ ప్రజల మనోగతాన్ని బయటపెడుతూ, వారి…

Read More

పవన్ ‘ వారాహి’ ప్రకటనతో వైసీపీకి భయం పట్టుకుంది: మనోహర్

వైసీపీ నేతలకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేకుండా పోయిందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.ఓ పక్క ప్రజలు మాండేస్ తుపాన్ తో ఇబ్బందులు పడుతుంటే..కనీస చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం..దాన్ని వదిలేసి జనసేన పార్టీ వాహనం వారాహి రంగుల మీద మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు  ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు….

Read More
Optimized by Optimole