ప్రజా సమస్యల కోసం కృషి చేసే నాయకుడిని: కోటంరెడ్డి శ్రీధర్

NelloreRural: ఐదేళ్లకోసారి కనిపించే నాయకున్ని కాదని..నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకై కృషి చేసే నాయకుడినని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంగళవారం ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు.ఇక ఏ మాత్రం అధికార పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి…

Read Full News

Appolitics: అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళ్లాలని కోటంరెడ్డి నిర్ణయం

అమరావతి: నెల్లూరు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం జరగనున్న ఏపీ  అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా  వెళ్లాలని ఆయన నిర్ణయించారు. నియోజకవర్గం లో‌ని సమస్యల  ప్ల కార్డుల ను ప్రదర్శిస్తూ వెలగపూడి లోని మారుతి సుజికీ షోరూమ్ నుండి అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్ర వెళ్లాలని కోటం రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండటంతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. కాగా రెండు నెలల క్రితం కోటం రెడ్డి వైసీపీ పార్టీపై…

Read Full News

జగన్ పార్టీ ఎందుకు పెట్టారు?: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

వైకాపా నేతల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అసంతృప్త నేతలను తమ పార్టీ నాయకులతో ఒకరిద్దరు తిట్టినంత మాత్రాన ఈ అసంతృప్తులు ఆగవని హెచ్చరించారు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తి చల్లారాలంటే మన ఆలోచన విధానం మారాలన్నారు. నియంతలం… ఎవరైనా మనం చెప్పినట్టే వినాలని అనుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన జగన్, ముఖ్యమంత్రి అయినప్పుడు..అదే ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి…

Read Full News

సీఎం వైఖరి మార్చుకుంటే… ప్రజా ప్రతినిధులంతా మార్చుకోవాలా?: ఎంపీ రఘురామ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకున్న ప్రతిసారి, ప్రజా ప్రతినిధులంతా ఆయన చెప్పినట్టు నడుచుకోకుండా … తానా అంటే తందానా అనకపోతే పార్టీ ద్రోహులయితే, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి కాదా? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ… అమ్మకాలు తగ్గితే అధికారులను తిట్టడాన్ని ఏమంటారని నిలదీశారు. అమరావతియే…

Read Full News
Optimized by Optimole