తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫైర్!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి…

Read More

మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించిన రాజగోపాల్..

మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. ఇక ఎమ్మెల్యే పదవికి…

Read More

బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్​ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…

Read More

సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్న కోమటిరెడ్డి ఫ్యాన్స్..

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు సభలో నేతలంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా మాటల దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి పై విరుచుకుపడిన తీరుపై కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటే సీనియర్ నేతలు వారించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రేవంత్ అనుచరవర్గంతో కావాలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని అభిమానులు  సోషల్…

Read More

దయాకర్ కామెంట్స్ పై కోమటిరెడ్డి అభిమానులు ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!

మునుగోడు కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. గతంలో పాకిస్తాన్ అనుకూలంగా దయాకర్ చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులు దయాకర్ పై మాటలతో విరుచుకుపడుతున్నారు. రేవంత్ కూ బానిసిలా వ్యవహరిస్తూ .. కోమటిరెడ్డిపై చేసిన అనూచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి అభిమానులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలా చేసే బహిష్కరణకు గురయ్యారని గుర్తు చేశారు. ఇక ముునుగోడు సభలో మాట్లాడిన…

Read More

కాంగ్రెస్ పార్టీకి దాసోజు గుడ్ బై.. నెక్ట్స్ వికెట్ ఎవరూ?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో నేతల పార్టీ మార్పుపై విస్తృత చర్చ నడుస్తోంది.ముఖ్యంగా హస్తం పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటీకే రాజగోపాల్ పార్టీ, పదవికి రాజీనామా చేయగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో అగ్రకుల దురహాంకారం పెరిగిపోయిందని.. పార్టీ కోసం కష్టపడ్డ మాలాంటి నేతలకు గుర్తింపు లేదని ఆవేదనతో పార్టీ వీడుతున్నట్లు శ్రవణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.అటు రాజగోపాల్ తనతోపాటు…

Read More

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రచ్చ.. రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి ఫైర్!

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక వేడి రాజుకుంది. నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రాజగోపాల్ ద్రోహి అంటూ ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వెంకట్ రెడ్డి మాకుటుంబ సభ్యుడేనని కుండబద్దలు కొట్టారు. అటు బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం తథ్యమని జోస్యం చెప్పారు.ఎంపీ వెంకట్ రెడ్డి ప్రధానినీ కలవడంపై భిన్నంగా స్పందించారు. ఇక వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ ముఖం చూసే ప్రసక్తే…

Read More

రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్ అటాక్..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చారు. రాజగోపాల్ బీజేపీలో చేరుతున్నారన్న అక్కసుతో రేవంత్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బీజేపీనేతలు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రేవంత్ చేసిన ఆరోపణల వీడియో క్లిప్పింగ్స్ చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్.. నేడు తెలంగాణ తల్లి అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ భాష మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు.  …

Read More

బ్లాక్ మెయిలర్ ‘బ్రాండ్ నేమ్’ రేవంత్ : రాజగోపాల్

మునుగోడు రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసినట్లు నిరుపిస్తే  రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు రాజగోపాల్. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసీడర్ రేవంత్ అంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, వైఎస్సార్ అవమానపర్చిన నేత రేవంత్ ఒక్కడేని.. పీసీసీ పదవితో రాష్ట్రాన్ని దోచుకోవాలని…

Read More

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ.. టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు ఫైర్!

అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ నేతలు . బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో పార్టీ కార్యకర్తలు.. నేతల మధ్య కోలాహాలంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.హామీలతో మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలను అంతమొందించడానికి ..ప్రతి…

Read More
Optimized by Optimole