కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా!

తెలంగాణ కాంగ్రెస్కీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం పార్టీ కి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పిసిసి చీఫ్ కుమార్ రెడ్డికి పంపారు. రెండు నెలల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ భవిష్యత్తు పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్నట్లు విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితులతో చెబుతున్నా మాటగా వినిపిస్తుంది. మరోవైపు విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో రాజీనామా అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2014 లో చేవెళ్ల టిఆర్ఎస్ అభ్యర్థిగా లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన ఆయన, 2019లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయారు.