మహాశివరాత్రి: శివరాత్రి పర్వదినాన భక్తులు నిష్టతో శివున్ని లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన అభిషేకాలు ,పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. అసలు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఎందుకు పాటిస్తారు? జాగరం ఎందుకు చేస్తారు? అన్నది భక్తుల మదిలో మెదిలే ప్రశ్న! పురాణాల ప్రకారం దాని వెనక ఒక కథ ఉంది. అది ఎంటో తెల్సుకుందాం..!
ప్రాచుర్యంలో ఉన్న కథ:
అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మధనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది.హాలాహలాన్ని అలాగే విడిచి పెట్టేస్తే అది ముల్లోకాలను దహిచి వేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులు అందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన బోలా శంకరుడు ని శరణు వేడారు. లోక రక్షణ కోసం మహాదేవుడు ఆ గరలాన్ని తానే మింగి గొంతులో బంధించి గరళకంఠుడయ్యాడు.
హాలాహల ప్రభావానికి శివుడి కంఠం నీలంగా మారడంతో నీలకంటుడిగా పేరుపొందాడు. గరలాన్ని గొంతులో బంధించడం వల్ల శివుని లో విపరీతమైన తాపాన్ని పుట్టించే సాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగరం మధునంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు.
హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడి మెలుకువ వచ్చేంతవరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోను జప ధ్యానాలతో భక్తులు కాలక్షేపం చేస్తారు.
పురాణాలకు ముందునుంచే ఉనికిలో శివరాధన:
సింధులోయ నాగరికత వేసిన కాలంలో శివుడిని ప్రజలు పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500- 1200 నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దానికి చెందిన శ్వేతా శ్వేతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాలు ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భవద్గీత కంటే మునుపటిది. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్ ఫ్లడ్ వంటి చరిత్రకారుల అంచనా.
లింగరూపం ప్రధానమైంది:
శివారాధనలో మూర్తి రూపం, లింగం రూపంలోనూ స్వామిని భక్తులు పూజిస్తారు. అయితే లింగ రూపమే ప్రధానమైందిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపించి.. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో మహాశివుడికి రుద్రాభిషేకం చేస్తారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు.