×

పార్థసారథి పొట్లూరి: ఢిల్లీ,పంజాబ్ ప్రజలకి శుభాకాంక్షలు !

ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ?

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని సిబిఐ అరెస్ట్ చేసింది! ఆరు నెలల పాటు సాగిన ఉత్ఖంఠ అనంతరం ఎట్టాకేలకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ని అరెస్ట్ చేయగలిగింది సిబిఐ !
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేయడానికి సిబిఐ కి ఆరు నెలలు ఎందుకుపట్టింది ?
బలమయిన సాక్ష్యాధారాలు దొరికే వరకు సిబిఐ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయకుండా ఊరుకుంది?
అవును బలమయిన సాక్ష్యాధారాలు దొరికితేనే కానీ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయకూడదు అని బలంగా తీర్మానించుకుంది సిబిఐ.
మరి గత ఆరునెలలుగా దొరకని సాక్ష్యాధారాలు ఇప్పుడు దొరికాయా ?
అవును! సాక్ష్యాధారాల కోసం సిబిఐ వేచి చూసింది కానీ అవి అంత సులభంగా దొరకలేదు..!

కేజ్రీవాల్ గుంట నక్క కుట్రలు!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనదగ్గర ఒక్కటంటే ఒక్క మంత్రిత్వ శాఖని అట్టిపెట్టికోలేదు ! ఇదో రికార్డ్ భారత దేశ ముఖ్యమంత్రుల ని పోల్చి చూస్తే ఇప్పటివరకు. కేజ్రీవాల్ అనే వ్యక్తి కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రమే ! అన్ని మంత్రిత్వ శాఖలు తన అనుచరులకి కట్టబెట్టాడు తప్పితే తన వద్ద ఒక్క శాఖని కూడా ఉంచుకోలేదు ! ఎందుకని ? జస్ట్ ఏదన్నా అవినీతి ఆరోపణలు వస్తే అవి తన అనుచరులు చేసినవి అని తప్పించుకోవడానికి వేసిన ప్లాన్ ఇది. PSP

పోనీ ఒక్కకరికి ఒక్కో శాఖ ఇచ్చాడా ? లేదు ఇవ్వలేదు. తనకి అత్యంత విశ్వశనీయులు అయిన సత్యేంద్ర కుమార్ జైన్ మరియు మనీష్ సీసీడియాలకి ఎక్కువ సంఖ్యలో శాఖలు అప్పచెప్పాడు కేజ్రీవాల్.
1. సత్యేంద్ర కుమార్ జైన్ కి అప్పచెప్పిన మంత్రిత్వ శాఖలు: హోమ్ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, వాటర్ శాఖ, పరిశ్రమల శాఖ, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఫ్లడ్ కంట్రోల్ శాఖ. మొత్తం 8 మంత్రిత్వ శాఖలని ఒక్క సత్యేంద్ర కుమార్ జైన్ కె అప్పచెప్పాడు కేజ్రీవాల్. ఈ మొత్తం 8 శాఖలలో జరిగే అవినీతి పనులకి ఒక వేళ అవి బయటపడితే అవి సత్యేంద్ర కుమార్ చేసినట్లు అవుతుంది కానీ కేజ్రీవాల్ కాదు కానీ ముడుపులు మాత్రం క్రేజీవాల్ అకౌంట్ లో వెళ్లిపోతాయి. సత్యేంద్రకుమార్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 9 నెలలు అవుతున్నది కానీ బెయిల్ రాలేదు.
2. మనీష్ సిసోడియా: ఆర్ధిక శాఖ,ఎక్సైజ్ శాఖ,ఎడ్యుకేషన్ శాఖ, టూరిజం శాఖ, PWD శాఖ, కార్మిక శాఖ, ప్లానింగ్ శాఖ, లాండ్ & బిల్డింగ్ శాఖ, విజిలెన్స్ శాఖ, సర్వీసెస్ శాఖ, ఆర్ట్ & కల్చర్ శాఖ, భాషా శాఖ. ఇలా మొత్తం 14 మంత్రిత్వ శాఖలు మనీష్ శిశోడియా చేతిలో పెట్టాడు.
3. మనీష్ సిసోడియా అరెస్ట్ అవగానే తన మంత్రిత్వ శాఖలకి రాజీనామ చేశాడు దానిని కేజ్రీవాల్ ఆమోదించాడు!అయితే గత 9 నెలలుగా జైల్లోనే ఉన్న సత్యేంద్రకుమార్ జైన్ కూడా రెండు రోజుల క్రితం మనీష్ సిసోడియ తో పాటు రాజీనామా చేశాడు. ఎందుకంటే మొత్తం 20 మంత్రిత్వ శాఖలు కలిపి సత్యేంద్ర మరియు మనీష్ చేతిలో ఉన్నాయి కాబట్టి చచ్చినట్లు రాజీనామా చేయాల్సి వచ్చింది.
4. గత 9 నెలలుగా సత్యేంద్ర కుమార్ జైన్ జైల్లోనే ఉన్నా ఒక మంత్రి హోదాలోనే ఉంటూ వచ్చాడు కానీ సత్యేంద్ర నిర్వహిస్తున్న శాఖల తాలూకు ఫైళ్ళ మీద సంతకాలు ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న మనీష్ సిసోడియ పెడుతున్నాడు కానీ ఆ శాఖలని తాను తీసుకునే బాధ్యతని కేజ్రీవాల్ చేయలేదు. ఎందుకని ?
5. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు తాలూకు ఇప్పటి వరకు ఢిల్లీ ప్రభుత్వం తరుపున 45 కోట్లు ఖర్చుపెట్టాడు కేజ్రీవాల్! ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు కానీ మంచినీళ్ళలా ఖర్చుపెట్టేశాడు క్రేజీ వాల్ !

చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ వచ్చిన మనీష్ సిసోడియ కానీ క్రేజీ వాల్ లకి ఎక్కడ తన్నింది ?

కేజ్రీవాల్ అంతిమంగా డబ్బు ముట్టినా అతను చాలా తెలివిగా తప్పించుకుంటూ తన అనుచరలని ఒక్కొక్కరినీ జైలు పాలు చేస్తున్నాడని గ్రహించిన ముగ్గురు నిందితులు కేజ్రీవాల్ కి ఎదురు తిరిగారు వాళ్ళు : అమిత్ అరోరా,సమీర్ మహేంద్రు,విజయ్ నాయర్ లు. వీళ్ళు ముగ్గురూ సిబిఐ కి బలమయిన సాక్ష్యాధారాలు ఇచ్చారు!

సౌత్ గ్రూప్ తో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాల్గొన్న వాళ్ళు అందరూ ఒకే పద్ధతిని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వారం తమ తమ ఐ ఫోన్ లు,ఖరీదయిన యాండ్రాయిడ్ ఫోన్లు మరియు టాబ్ లు,ల్యాప్టాప్ లని పగులకొట్టి వాటిని కాల్చివేసేయాలి. మళ్ళీ కొత్త ఫోన్ల ని కొని కొత్త సిమ్ కార్డులని వేసి వాడాలి. సౌత్ గ్రూప్ తో పాటు అందరూ చివరికి మనీష్ సిసోడియ కూడా వారం కాగానే తమ తమ ఫోన్ల ని ధ్వంసం చేసి వాటిని కాల్చివేస్తూ వచ్చారు కానీ ముందు జాగ్రత్తగా క్రేజీవాల్ సంగతి తెలిసిన వారు కావడం చేత విజయ్ నాయర్,సమీర్ మహేంద్రు,అమిత్ ఆరోరాలు మాత్రం తమ ఫోన్ల ని అలానే ఉంచేసి అనుమానం రాకుండా కొత్త సిమ్ కార్డు కొత్త నంబర్ లతో లావాదేవీలు నిర్వహిస్తూ వచ్చారు.

సిబిఐ మరియు ED లు ఒక్కో ఉచ్చు బిగిస్తూ రావడం చూసిన ఈ ముగ్గురూ అప్రూవర్ గా మారిపోయి సిబిఐ తో సహకరించాలని తద్వారా కొద్దిపాటి శిక్షతో బయటపడవచ్చు అని భావించారు. ఈ ముగ్గురూ తాము లిక్కర్ స్కామ్ సమయంలో వాడిన ఫోన్లని సిబిఐ కి ఇచ్చేశారు!

సిబిఐ ఆపిల్ సర్వర్స్ మరియు యాండ్రాయిడ్ సర్వర్స్ నుండి పూర్తి స్థాయి సమాచారం సేకరించడానికి సమయం పట్టింది కానీ నిరూపించతగ్గ ఆధారాలు సేకరించగలిగింది అందుకే ఆలస్యం అయ్యింది! కాబట్టి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదు. So! కేజ్రీ వాల్ తో పాటు కవిత ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రాధమిక సాక్ష్యాలు బలంగా ఉండడం వలనే మనీష్ సిసోడియా బెయిల్ కోసం అప్లై చేయగానే సిబిఐ న్యాయవాదులు సాక్ష్యాధారాలని న్యాయమూర్తి ముందు ఉంచారు దాంతో సిబిఐ కోర్ట్ బెయిల్ తిరస్కరించింది మనీష్ శిశోడియా కి.

సౌత్ గ్రూప్ తరుపున 200 కోట్ల రూపాయాలని తానే స్వయంగా మనీష్ సిసోడియ కి ఇచ్చానని ఈ కేసులో కీలక నిందితుడు విజయ్ నాయర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఆయా తేదీలలో ఆయా కార్యాలయాల CC కెమెరా ఫుటేజ్ విజయ్ నాయర్ ఇచ్చిన సమాచారానికి సరి పోలి ఉంది !

విజయ్ నాయర్ ఇచ్చిన సమాచారం ప్రకారం 200 కోట్ల లో 30 కోట్లు గోవా ఎన్నికల ప్రచారానికి మరియు 50 కోట్లు గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వినియోగించారు. ED ఈ మొత్తం 80 కోట్లు ఎక్కడి నుండి ఎక్కడికి ఎవరికి వెళ్లాయో కనిపెట్టగలగడం ఈ కేసులో ముఖ్యమయిన విషయం. ఎందుకంటే ED కేసులో కనుక అరెస్ట్ అయితే బెయిల్ దొరకడం కష్టం.

మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే విజయ్ నాయర్ అనే బ్రోకర్ ఎలాంటి రాజ్యాంగ పదవిని కలిగి లేడు ! కానీ విజయ్ నాయర్ ఢిల్లీ లో ఉండేది ఆప్ ప్రభుత్వ మంత్రి ఉండే బంగ్లా లో ! ఢిల్లీ లోని సివిల్ లైన్స్ లో ఉన్న ఆప్ ప్రభుత్వం లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్న కైలాష్ గెహ్లాట్ కి కేటాయించిన అధికారిక బంగ్లా లో విజయ్ నాయర్ ఉంటున్నాడు. కైలాష్ గెహ్లాట్ మాత్రం తన స్వంత ఇంట్లో ఉంటున్నాడు. ఫైవ్ స్టార్ హోటళ్లతో పాటు విజయ్ నాయర్ ఉంటున్న మినిస్టర్ బంగ్లా లో ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. మినిస్టర్ బంగ్లా కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు In Out రిజిస్టర్ నిర్వహిస్తారు CC కేమరాలతో పాటు.

ఈ కేసులు మరో బలమయిన సాక్ష్యం ఇచ్చింది సమీర్ మహేంద్రు! సమీర్ మహేంద్రు ఇచ్చిన వాంగ్మూలంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఆ పాలసీ కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఢిల్లీ మంత్రివర్గం ఆమోదించకముందే తనకి ఇచ్చారని పేర్కొన్నాడు. ఆ డాక్యుమెంట్ల మీద ఎలాంటి సంతకాలు కానీ, అధికారిక స్టాంప్ లు కానీ లేవు. నిజానికి లిక్కర్ పాలసీ కాపీలని మంత్రివర్గం ఆమోదించాక ఇవ్వవచ్చు ఎవరన్నా అడిగితే అయితే వాటి మీద అధికారిక స్టాంప్ లతో పాటు సంబంధిత అధికారుల,మంత్రి యొక్క సంతకం ఉంటుంది. ఇది బలమయిన సాక్ష్యం!

తన అనుచరులలో ముగ్గురు అప్రూవర్స్ గా మారారని మొబైల్ ఫోన్ల ని సిబిఐ కి ఇచ్చారని మనీష్ సిసోడియా అరెస్ట్ కి రెండు రోజుల ముందే కేజ్రీవాల్ కి తెలిసిపోయింది కాబట్టి మరో రెండు రోజుల్లో సిబిఐ మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేస్తుందని ముందస్తు జాతకం చెప్పాడు క్రేజీ!

ఇక అసలు డ్రామా కి తెరతీశాడు మనీష్ సిసోడియ ! తనని ప్రశ్నించడానికి పిలిచి సిబిఐ అరెస్ట్ చేస్తుందని నిర్ధారణకి వచ్చాక మనీష్ ఢిల్లీ లోని రాజ్ ఘాట్ లో ఉన్న గాంధీ సమాధి దగ్గర కూర్చుని ప్రార్ధన చేసే సన్నివేశం మాత్రం బాగానే రక్తి కట్టింది !

మనీష్ సిసోడియ ని అరెస్ట్ చేశాక ఎలాంటి ప్రదర్శనలు,నిరసనలు వ్యక్తం కాలేదు! జనాలని సమీకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆందోళన చేయించడం వృధా మరియు అనవసరంగా మనీష్ కి పబ్లిసిటీ ఇచ్చినట్లు అవుతుందని ఊరుకున్నాడు క్రేజీ !

2012 లో క్రేజీ వాల్ జార్జ్ సోరోస్ మనిషి అని అప్పట్లో వచ్చిన వదంతులు నిజంఅని తరువాతి కాలంలో ఇప్పుడూ స్పష్టంగా తెలిసిపోతున్నది!
ఇక మన కవితక్క ప్రొఫెసర్ శ్రీ కొత్తపల్లి జయ శంకర్ గారి సమాధి దగ్గర కూర్చొని చేతులు జోడిస్తూ చేసే ప్రార్ధనా విన్యాసం త్వరలో మనం చూడబోతున్నాము అన్నమాట ! ఢిల్లీ లోని సిబిఐ ఆఫీసు ఎదుట brs కార్యకర్తల నిరసనలు కూడా చూడబోతున్నాము త్వరలో !
ఉడ్తా పంజాబ్ కధనం రెండో పార్ట్ లో ..
జైహింద్ !జై భారత్ !

========

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all
Optimized by Optimole