అరాచకంతో అందలం నిలబెట్టుకోవాలనేది జగన్ కుతంత్రం: నాదెండ్ల మనోహర్

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని వైసీపీ భావిస్తోందని.. ఎలాగైనా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోందని ఆయన అభిప్రాయడ్డారు. వచ్చే ఎన్నికల్లో అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రమని అన్నారు.గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ…

Read Full News

మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు..

Nancharaiah merugumala senior journalist: _ మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు  _ దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్నట్టు మనోళ్ల ఏడుపు _ చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు,…

Read Full News

‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అంటే ఇదే మరి!

Nancharaiah merugumala senior journalist:(ఇందిర కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ‘ఇండియా’లో, ఇద్దరు ‘భారత్‌’లో!) ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అనే మాటలు భారత రాజ్యాంగంలో ఉండబట్టే నెహ్రూ–గాంధీ–వాడ్రా కుటుంబానికి మంచి వెసులుబాటు దొరికింది. మాజీ సోషలిస్ట్, సెక్యులర్‌ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కోడలు సోనియాగాంధీ, పెద్ద మనవడు రాహుల్‌ గాంధీ లోక్‌ సభ సభ్యులుగా ‘ఇండియా’లో (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌) ఉండగా, చిన్న కోడలు మేనకాగాంధీ, చిన్న మనవడు ఫిరోజ్‌ వరుణ్‌ గాంధీ ఎంపీలుగా ‘భారత్‌’లో (భారతీయ జనతాపార్టీ)…

Read Full News

ఇండియా పేరును ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అని మార్చుకోవచ్చనే ఆశ 50 ఏళ్ల క్రితం ఉండేదే!

Nancharaiah merugumala senior journalist: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిస్ట్‌ రిపబ్లిక్స్‌ (ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌) అని మన దేశం పేరును మార్చుకోవచ్చని 1960ల చివర్లో, 1970ల ఆరంభంలో లక్షలాది మంది జనం అనుకునేవారు. ‘ప్రజా పోరాటాలు’ విజయవంతమయ్యాక  నూతన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత ఉపఖండం యావత్తూ కొత్త బంగారులోకంగా మారుతుందని ఆశించేవారు. ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అనే ఈ ప్రతిపాదిత పేరు నాటి అగ్రరాజ్యాల పేర్లు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్యే), యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ (యూఎసెసార్‌)కు…

Read Full News

జమిలి ఎన్నికల’ పై మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు బహిరంగ లేఖ..

Hyderabad: జమిలి ఎన్నికల’ పై మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాష్ రావు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో అకస్మాత్తుగా  ‘జమిలి ఎన్నికలు’ గురించి  హడావుడి చేయడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు .బుధవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా  ప్రకాశ్ రావు మాట్లాడుతూ..నిజంగా ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సంస్కరణల…

Read Full News

అమర్‌ సింగ్‌ చేతిలో తన్నులు తిన్న అరవ బాపనాయనకు పీవీ పై కోపమెందుకు?

Nancharaiah merugumala senior journalist: (పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్‌ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా?)   ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్‌ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్‌–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్‌–వరంగల్‌ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని…

Read Full News

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పటేన్ల పటాతోపం..

బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలుగు రాష్ట్రాల్లో ‘‘రెడ్డి రాజుల’’ పాలన కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల్లో లభించిన శాసనాల్లో రెడ్డి రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చింది. నది పరివాహక ప్రాంతాలను అసరా చేసుకొని సాగిన రెడ్డి రాజుల పాలనలో సాహసోపితమైన నిర్ణయాలు, వ్యవసాయ అభివృద్ది జరిగిందని చెబుతారు. ఆ నాటి నుంచి బలపడుతూ వస్తున్న రెడ్డిలు (పటేన్లు) ప్రస్తుత రాజకీయాల్లో కూడ అధిపత్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబరుస్తు వస్తున్నారు. ఆరు…

Read Full News

బాలెం గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్: ప్రిన్సిపల్ శైలజ

Suryapeta: సూర్యాపేట:బాలెంల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో  2023 – 24 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు  ప్రిన్సిపాల్ డాక్టర్  పి. శైలజ  ఓ  ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం.పి.సి, ఎం.ఎస్.డి.ఎస్. బి.కాం జనరల్,బి జెడ్ సి,ఎం జడ్ సి సబ్జెక్ట్స్ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కొరకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2022 – 2023 విద్యాసంవత్సరం లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన  ఎస్సీ…

Read Full News

నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో గుర్తింపు..

Hyderabad:  నవ్యనాటక సమితి 48వ ఆల్‌ ఇండియా మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ పోటీల ముగింపు కార్యక్రమాలు రవీంద్రభారతిలో శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. నవ్యనాటక సమితి సంస్థ నిరాటంకంగా ప్రతి సంవత్సరం కళాకారులను ప్రోత్సాహిస్తూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించిడమే నవ్యనాటక సమితికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రత్యేక…

Read Full News
Optimized by Optimole