తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 87 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 64, కృష్ణా జిల్లాలో 46, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 675 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు కరోనా తో మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *