Appolitics: వైఎస్ జగన్ 2.0.. పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్?

Appolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర చర్చ మొదలైంది. 2017లో ప్రజా సంకల్ప యాత్రతో అధికారాన్ని అందుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మరోసారి ప్రజల మధ్యకు రావడానికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ “జగన్ 2.0 పాదయాత్ర”పై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశం పై newsminure24 ప్రత్యేక కథనం..    

Read Full News

crimenews :మహిళపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం

విజయవాడ, ఆగస్టు 30: విజయవాడ నగర శివారులోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు అర్ధరాత్రి సమయంలో మహిళ ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళను కొంతకాలంగా గమనిస్తున్న ఐదుగురు యువకులు ఆమె ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి…

Read Full News

Appolitics:

ఒంగోలు, ప్రత్యేక కథనం: ఒంగోలు రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు, ఆశావహ నేతలు మాత్రం భవిష్యత్ పోరాటానికి సన్నద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు దృష్టి సారిస్తూ, రాజకీయ సమీకరణాలకు పదును పెడుతున్నారు. https://youtu.be/mUDdYazfI0s?si=CpYOA93tPYrFpzam గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, తమ బలాబలాలను అంచనా వేస్తూ, కొత్త వ్యూహాలను రూపొందించడంలో ప్రధాన పార్టీలు…

Read Full News

TTD: శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం అమలు

తిరుమల, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం రోజుకు 300 శ్రీవాణి దర్శన టికెట్లను ఇప్పటికే రూ.10,000 విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే…

Read Full News

Ap: పేద విద్యార్థుల నాణ్యమైన వసతి కల్పనలో వెనక్కి తగ్గేదే లేదు:ఎంపీ సతీష్

Vijaywada: గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ వంటి నగరాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థుల వసతి సమస్యలను తీర్చేందుకు ‘రాయల్ సర్వీస్ ట్రస్ట్’ ఒక బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామ పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రతిష్టాత్మక హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు ఈ ట్రస్ట్ నడుం బిగించింది. ఈ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరుతూ, ట్రస్ట్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్…

Read Full News

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటూ ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో హీరో జునైద్ ఖాన్, ఆయన తండ్రి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో కలిసి సాయిపల్లవి సందడి చేశారు. సాధారణంగా గ్లామర్ కంటే పాత్ర ప్రాధాన్యానికే విలువిచ్చే సాయిపల్లవి, ఈ కార్యక్రమంలో కూడా తన…

Read Full News

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆకాంక్షించారు.ఆదివారం తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఏడవ శాఖ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సానా సతీష్ బాబుకు బ్యాంక్ ప్రతినిధులు లక్ష్మి కోటేశ్వరరావు, రామకృష్ణలు…

Read Full News

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా ఉండేది. వాటిపై రుసరుసా కిందకు నడుస్తూ దాదాపు ఆఖరి మెట్టు దిగుతున్నానేమో….! నా వెనుక నుంచి, ‘ఏయ్ దిలీప్, ఏంటి అలా వెళిపోవడమేనా? ఒక నిమిషం ఆగు, నేనూ వస్తున్నానయా’ అన్న మృదువైన స్వరం నన్నాపింది. ఆ ఆఖరి మెట్టు కూడా దిగి నిలబడ్డాను. దగ్గరకొచ్చి,…

Read Full News

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి. ఉష్ణమండల దేశం భారత్‌లో సన్ (ఎస్‌యుఎన్) స్ట్రోక్ లాగే దేశ రాజకీయాల్లో సన్ (ఎస్‌ఓఎన్) స్ట్రోక్‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు,…

Read Full News

ap: ప్రమాదంలో గ్రామ సచివలయాలు: పీపుల్స్ పల్స్

Appolitics: పారదర్శక ప్రజా విధాన విశ్లేషణకు అంకితమైన పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 20 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం, ఉత్తరాన ఇచ్ఛాపురం నుండి దక్షిణాన తడ వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు మరియు మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సాగింది. పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది,…

Read Full News
Optimized by Optimole