ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర

Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో ఆత్మ మరొక ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ ప్రయాణానికి మార్గదర్శకమే మరణానంతరం చేసే 13 రోజుల క్రియలు. మరణం అనంతరం: మరణం సంభవించిన వెంటనే మనిషి స్థూల శరీరాన్ని విడిచి ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది.ఈ సమయంలో ఆత్మకు శరీరంపై, కుటుంబంపై ఇంకా మమకారం మిగిలే…

Read More

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఎప్పుడు వెలిగించాలి? పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా 360 వత్తులను వెలిగించవచ్చు.కార్తికమాస పౌర్ణమి నాడు వెలిగించడం అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది.ఆలయాల్లో, దీపోత్సవాల్లో ఈ దీపదానం చేయడం సత్కార్యం.ఇంటివద్ద వెలిగించాలనుకుంటే సాధారణంగా ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, లేదా పౌర్ణమి నాడు తులసి కోట వద్ద…

Read More

kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని పురాణాల్లో తెలుపబడింది. ఈ మాసంలో పిల్లల పుట్టుక బాధపడుతున్న వారు..జాతకపరంగా దోషాలు ఉన్నావారు ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. పురాణ కథ…. శివుడు ఓసారి తీవ్ర తపస్సులో లీనమై ఉన్నాడు. అప్పుడు మన్మథుడు ప్రేమబాణంతో శివుడి తపస్సును భంగపరిచాడు. ఆ కోపంలో…

Read More

Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?

Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం. ఈ ఆలయంలోని అమ్మవారిని రాత్రి పూట పూజించడం ఇక్కడి ప్రత్యేకత.అసలు అమ్మవారిని రాత్రి పూట మాత్రమే ఎందుకు పూజిస్తారు? ఇతర ఆలయాల్లో మాదిరిగా ఉదయం వేళల్లో పూజలు జరిపిస్తే ఏమవుతుంది? కాశీని కాపాడే గ్రామదేవతగా ఉగ్రవారహి అమ్మవారిని అక్కడి ప్రజలు కొలుస్తారు. ఈ అమ్మవారిని ఉదయం…

Read More

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం అవతరించిన శ్రీవరాహస్వామికి, ఆయన శక్తిస్వరూపిణి అయిన వారాహీ అమ్మవారిని ఈ నవరాత్రులు పేరిట పూజించడం ఆనవాయితీగా వస్తోంది. *వారాహీ – భూమాతా స్వరూపిణి* వారాహీ అంటే కేవలం శక్తి కాదు సాక్ష్యాత్తు భూమాత స్వరూపిణి. ఆమె చేతిలో శంఖం, చక్రం, నాగలి, రోకలితో సహా పలు…

Read More

Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. కానీ అదే సమయంలో, ఈ మాసం అనేక ఆధ్యాత్మిక వ్రతాలకు, అనుష్ఠానాలకు అత్యంత ముఖ్యమైనది. ఈ నెలలో పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష చేపడతారు. ఇది విశ్రాంతి, ధ్యానం, ఆత్మ పరిశుద్ధతకు చిహ్నం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే, ఈ…

Read More

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట తెలియర విశ్వదాభిరామ వినుర వేమ! అంటాడు యోగి వేమన. అభిమానించే దైవం మదిలోనే ఉంటాడని, ఉండాలని ఓ లెక్క! నమ్మకమే ఉంటే…. దేవుడెక్కడ లేడు చెప్పండి? ఇదీ హేతువు! ఇదంతా విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం. మనది ప్రధానంగా విశ్వాసాల మీద ఆధారపడిన జీవన వ్యవస్థ. మనిషిలోని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే వ్యాపార ప్రక్రియలు ఇతర అన్ని వ్యవస్థల్లోకి…

Read More

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏకాదశి గురించి మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. భవిశ్యోత్తర పురాణం: వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే…

Read More

literature: మన తెలుగు – మన వెలుగు.. పద్య నిర్మాణ కౌశలం..!

Teluguliterature: శా : ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చిద్ర్దోహంబును నీకుఁజేయరు, బలోత్సేకంబుతోఁ జీకటిన్ భద్రాకారులఁ చిన్న పాపల రణప్రౌఢక్రియా హీనులన్ నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో? ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలు… అదీ అన్నెం-పుణ్ణెమెరుగని చిన్నారులు… ఒకరో ఇద్దరో కాదు ఐదుగురిని, ఒక్కపెట్టున గొంతుకోసి సంహరిస్తే ఏ తల్తి గర్భశోకమైనా ఎలా ఉంటుంది? గుండెను పిడికిట పట్టి పిసికినట్టుండే ఆ తల్లి హృదయ వేదనను ఆవాహన చేసుకొని… బమ్మెర పోతన రాసిన…

Read More
Optimized by Optimole