మహిళ గోడపై పిడకలు కొట్టే వీడియో వైరల్!

ఓ మహిళ గోడపై ఆవు పిడకలు కొట్టే వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గామారింది. గోడపై ఆవు పిడకలను ఖచ్చితమైన ప్రదేశంలో విసరడాన్ని చూసి ఆమె ప్రతిభ ఆమోఘమని నెటిజన్స్ కొనియాడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన IAS అధికారి అవనీష్ శరణ్ సైతం.. ఈ వీడియోనూ షేర్ చేస్తూ.. ఇండియన్ బాస్కెట్ బాల్ టీం ఆమె కోసం వెతుకుతుంది అంటూ క్యాప్షన్ జత చేశారు. Indian basket ball team is searching for her….

Read Full News

డార్క్ సర్కిల్స్ పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య కంటి కింది నల్లటి వలయాలు. నిద్రలేమి కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకోండి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. వర్క్ పనిలో భాగంగా ఆలస్యంగా నిద్రపోవడం.. ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయడం..టీవీ చూస్తూ కాలక్షేపం చేస్ వారిని ఈ సమస్యను ఎక్కువగా ఫేస్…

Read Full News

ఈ టిప్స్ పాటిస్తే ఫిట్ నెస్ మెరుగుపరుచుకోవచ్చు!

ఆరోగ్యం, ఫిట్ నెస్ స్థాయిని మెరుగుపరుచుకునేందుకు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు హెల్త్ నిపుణులు. గంటల కొద్దీ కిలో మీటర్లు నడవలిసిన అవసరంలేకుండా.. చిన చిన టిప్స్ పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాటు ఫిట్నెస్ మెరుగపరుచుకోవచ్చు అంటున్నారు. మరీ ఆ టిప్స్ ఎంటో తెలుసుకోండి. భోజనం తరువాత నడక:భోజనం తర్వాత కొంచెం సేపు అలా నడిస్తే చాలు మీ ఫిటెనెస్ మెరుగవుతోంది. రోజువారిగా ముప్పై నిమిషాలు..మూడు విధాలుగా నడిస్తే…

Read Full News

మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా!

మహారాష్ట్ర సీఎం పీఠంపై రిక్షావాలా కూర్చోబోతున్నాడు. బాలాసాహెబ్ శిష్యునిగా శివసేనలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఏక్ నాథ్ శిందే సీఎం పదవి చేపట్టబోతున్నారు. హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విధానాలతో విసుగుచెందిన ఆయన.. తిరుగుబాటు ఎగరవేసి మహావికాస్ అఘాడీ కూటమిని కూల్చడంలో శిందే కీలక పాత్ర పోషించారు. బీజేపీ పక్షాన చేరిన ఆయనను.. ఆపార్టీ అధిష్టానం ఊహించని విధంగా సీఎం పదవి కట్టబెట్టింది. రిక్షావాడి నుంచి సీఎంగా..! రిక్షా తొక్కితేగానీ పూటగడవని పరిస్థితి…

Read Full News

అమ్మాయికి 18.. అతనికి 61.. ప్రేమ పెళ్లి!

ప్రేమ గుడ్డిది  నానుడి. ఈ జంటను స్టోరీ చూస్తే మీరు నిజంగానే ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. మూగది.. చేవిటిది అనికూడా అంటారు. తాజాగా వారిద్దరినీ ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆజంట ప్రేమ కహానీ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఆ ప్రేమ కహాని ఎంటో మీరు చదివేయండి! పాకిస్థాన్ కి చెందిన 18 ఏళ్ల ఆశియా..61 ఏళ్ల వృద్ధుడైన రానా శంషాద్ నూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ వ్యవహారం…

Read Full News

టైలర్ కన్హయ్య లాల్ మర్డర్.. ఉదయపూర్ లో టెన్షన్ టెన్షన్!

Udauipur murder: రాజస్థాన్ టైలర్ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో ఉదయపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వందలాది మంది నిరసనకారులు కన్హయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని వెళ్లగొట్టారు. ఇక కన్హయ్య లాల్ అంతిమయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వేయ్యిమందికి పైగా నిరసనకారులు కాషాయ జెండాలు పట్టుకుని అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు కన్హయ్య లాల్…

Read Full News

ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?

ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు…

Read Full News

క్లైమాక్స్ కి చేరిన మహరాష్ట్ర రాజకీయ సంక్షోబం!

మహరాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.ఈమేరకు గవర్నర్ సీఎంకు లేఖరాశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయం పై శివసేన మండిపడుతోంది.బలనిరూపణ చట్టవిరుద్ధమని.. ఈవిషయమై సుప్రీం కోర్డు కు వెళ్తామని స్పష్టం చేసింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ని కోరిన కొద్ది గంటల్లోనే.. భగత్ సింగ్ కోశ్యారీ బలనిరూపణపై నిర్ణయం…

Read Full News

అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!

ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు….

Read Full News

రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది..?

దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత పీఠంపై.. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను కూర్చోబెట్టాలని అధికార ఎన్డీఏ భావిస్తుండగా.. విపక్ష ఇంద్రధనస్సు కూటమి తమ అభ్యర్థిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపి అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇరు పక్షాలు ప్రచార పర్వానికి తెరలేపారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ వ్యూహాత్మంగా వ్యవహరించింది. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అభ్యర్థిగా…

Read Full News
Optimized by Optimole