Telangana: సిపిఎం పార్టీకి విరాళాలు ఇచ్చి ఆదరించండి: వేముల బిక్షం

Atmakur:  ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న  సిపియం పార్టీకి విరివిగా విరాళాలు అందించి ఆదరించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం ఓ ప్రకటనలో కోరారు. ప్రజా శ్రేయస్సు కై ఉద్యమాల ఊపిరిగా పోరాడుతున్న పార్టీని తమవంతు సహాయ సహకారాలు అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చౌటుప్పల్ పట్టణంలో డిసెంబర్ 15,16,17 తేదీలల్లో సిపిఎం 3వ జిల్లా మహా సభలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బహిరంగ…

Read More

IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…

Read More

Telangana: సీఎం రేవంత్ నాయకత్వాన్ని అస్థిరపరిచే కుట్ర: పటేల్ రమేష్ రెడ్డి

Telangana:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ లగచెర్ల లో కలెక్టర్ పై దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. శుక్రవారం గాంధీభవన్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్ది అమాయక ప్రజలను రెచ్చగొట్టారని.. కేటీఆర్…

Read More

Telangana: అధికార, విపక్షాల మాటల రాజకీయంతో ప్రజలకు మేలు జరిగేనా..?

Raparthy vinod Kumar : తెలంగాణ లో ఒక్క ఘటనతో రాష్ట్ర రాజకీయాలు అమాంతంగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కులగణన ఓవైపు …. మరోవైపు ఫార్మా సిటీ పేరుతో వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూముల సేకరణకు వెళ్లిన కలెక్టర్ పైదాడి ఘటనలు గత వారం రోజులుగో పేపర్లో హెడ్ లైన్స్ గా, టీవీలో బ్రేకింగ్ న్యూస్ లు అయ్యాయి. కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పిన.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నారు. మూడు…

Read More

tribalsociety: గిరిజన సమాజాల్లో అభివృద్ధి వెలుగులు: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ

Raparthy vinod Kumar: అంతరాలను పూడ్చటమే కాదు… వారి వారసత్వం, గిరియువత సాధికారత లక్ష్యం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ.. అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సమాజాల కోసం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏళ్ల తరబడి సాగిన వ్యవస్థాగత నిర్లక్ష్యం అనంతరం వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. అంతరాలను పూడ్చడమే కాకుండా.. ఘనమైన వారి వారసత్వం, గిరియువత సాధికారత,…

Read More

KCR: కేసీఆర్ వ్యూహంతో ఫలితం దక్కేనా?

Telangana politics: రాష్ట్రంలో రాజకీయాలు….. శీతాకాలపు చలిని మరిపించేంత వేడి పుట్టిస్తున్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనమే పాటిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాల సారాంశం మాత్రం బయటకు వస్తోంది. ఇటీవలే… పాలకుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి, పంపిందీ అటువంటి సందేశమే! చాన్నాళ్లుగా ఆయన పాటిస్తున్న మౌనం వెనుక ఏముంది! అది వ్యూహాత్మక ఎత్తుగడా? రాజకీయ వైరాగ్యమా? జనం మెదళ్లను ఈ ప్రశ్న తొలుస్తోంది. ఇదుగో ఇప్పుడొస్తారు, అదుగో అప్పుడొస్తారు,…

Read More

Telangana: అయోధ్య, అలీగఢ్‌ కన్నా ఎక్కువ ‘సెన్సిటివ్‌’ అని నిరూపించిన ‘ కొడంగల్ ‘ గ్రామం లగచర్ల..!

Nancharaiah merugumala senior journalist: భోగమోని సురేశ్‌ అనే యువకుడికి ఎక్కడ లేని విస్తృత ప్రచారం!కలెక్టర్‌ కారద్దాలు పగిలితే కరంటు ఆగింది, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి! ఉత్తరాది, మణిపూర్‌తో పోల్చితే..తెలంగాణ సర్కారు ‘హైపర్‌ సెన్సిటివ్‌’ అయింది. తెలంగాణ రాష్ట్రం–వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, రెవెన్యూ అధికారులపై స్థానిక ఊళ్ల జనం జరిపిన దాడిలో ఒక్కరూ కన్నుమూయ లేదు. ఎవరి తలా పగల్లేదు. ఏ ఒక్కరి కాలూ విరగ…

Read More

KTRcomments: రేవంత్, పొంగులేటి ప‌ద‌వులు ఊడ‌టం ఖాయం: కేటీఆర్‌

KTRVSREVANTH: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని ..త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప‌ద‌వులు ఊడ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఈసంద‌ర్భంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చార సమ‌యంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మారింద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన అమృత్ టెండ‌ర్ల‌లో ఇంత పెద్ద అవినీతి జ‌రుగుతున్నా.. ప్ర‌ధాని…

Read More

Tribute: ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్.. ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన…

Read More

Maharashtraelections: ‘మహా’సంగ్రామంలో గ్యారెంటీల గడబిడ..!

Maharashtraelection2024: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ‘మహా’సంగ్రామం రసవత్తరంగా సాగుతున్న వేళ ఆ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు కూడా ఎన్నికల్లో కీలకాంశంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ’ కూటములు పోటాపోటీగా తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల గ్యారెంటీలు, పథకాలు, హామీలతో ఇతర అంశాలు కూడా ప్రచార అస్త్రాలవుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా సరిహద్దులుగా ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఏదో ఒక…

Read More
Optimized by Optimole