కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల…

inctelangana:2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో ను శుక్రవారం నాడు విడుదల చేసింది. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొని మ్యానిఫెస్టో ను విడుదల చేసారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో రూపొందించారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.అభయహస్తం.. మేనిఫెస్టో పేరుతో ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం అంటూ 37 అంశాలతో 42 పేజీలతో విడుదల చేసారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు.

 

Optimized by Optimole