Latest posts

All

Appolitics: వైఎస్ జగన్ 2.0.. పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్?

Appolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర చర్చ మొదలైంది. 2017లో ప్రజా సంకల్ప యాత్రతో అధికారాన్ని అందుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మరోసారి ప్రజల మధ్యకు రావడానికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ “జగన్ 2.0 పాదయాత్ర”పై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశం పై newsminure24 ప్రత్యేక కథనం..    

Read Full News

Telangana: కొండా చూపు.. గులాబీ వైపు?

Telangana: ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా..? రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న కొండా దంపతులు కొత్త రాజకీయ నిర్ణయానికి సిద్ధమవుతున్నారా..? అధికార కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారా..? గులాబీ పార్టీతో పాటు కమలం పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయా..? ఇంతకీ కొండా దంపతుల తదుపరి అడుగు ఏంటి..? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో..  

Read Full News

Telangana: 1000 రోజుల పాలన హిట్టా…?

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అధికారం అప్పగించి వెయ్యి రోజులు పూర్తవుతున్నాయి. 2023 డిసెంబరులో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మార్పు కోరుకున్న ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఆ మార్పు ఆకాంక్షలను ఎంతమేరకు పాలనలో ప్రతిబింబించారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి? ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు…

Read Full News

Telangana:బహుజన తెలంగాణే లక్ష్యం: కవిత

Nijamabad: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పోరాడిన ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో బహుజన తెలంగాణను నిర్మించడమే తమ లక్ష్యమని కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రజల ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎంతమేర మార్పు వచ్చిందన్నదే ఇప్పుడు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర సంపద, వనరులు, అధికార ఫలాలు కొద్దిమందికే పరిమితం కాకుండా పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు,…

Read Full News

Karimnagar: చేతకానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు: బండి సంజయ్‌

Karimnagar: కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ నేతలు దాడికి పాల్పడిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలను చూస్తూ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన…

Read Full News

crimenews :మహిళపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం

విజయవాడ, ఆగస్టు 30: విజయవాడ నగర శివారులోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు అర్ధరాత్రి సమయంలో మహిళ ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళను కొంతకాలంగా గమనిస్తున్న ఐదుగురు యువకులు ఆమె ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి…

Read Full News

Appolitics:

ఒంగోలు, ప్రత్యేక కథనం: ఒంగోలు రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు, ఆశావహ నేతలు మాత్రం భవిష్యత్ పోరాటానికి సన్నద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు దృష్టి సారిస్తూ, రాజకీయ సమీకరణాలకు పదును పెడుతున్నారు. https://youtu.be/mUDdYazfI0s?si=CpYOA93tPYrFpzam గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ, తమ బలాబలాలను అంచనా వేస్తూ, కొత్త వ్యూహాలను రూపొందించడంలో ప్రధాన పార్టీలు…

Read Full News

National: సోనియా గాంధీ పుస్తకంపై దేశవ్యాప్తంగా చర్చ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ “Belonging: A Journey of Love” విడుదలకు ముందే దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రేమ, కుటుంబం, రాజకీయాలు, విషాదాలు, అధికారానికి దూరంగా నిలిచిన తన నిర్ణయాల వరకు అనేక కీలక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు సమాచారం. పుస్తకం ఇంకా మార్కెట్‌లోకి రాకముందే దానిలోని కొన్ని అధ్యాయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ, నెహ్రూ-గాంధీ…

Read Full News

Telangana:ఉద్యమ నిబద్ధతతో బీఎస్పీకి నూతన జవసత్వం

Telangana: తెలంగాణ రాజకీయాల్లో నాయకులు అనేక మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అయితే సమాజ మార్పు కోసం, అణగారిన వర్గాల రాజకీయ సాధికారత కోసం తమ జీవితాన్ని అంకితం చేసే నాయకులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్. బహుజన సమాజం రాజకీయంగా బలపడకపోతే సామాజిక న్యాయం అసంపూర్ణంగానే మిగిలిపోతుందనే నమ్మకంతో ఆయన రాజకీయ ప్రయాణం సాగుతోంది. రాజకీయ అధికారమే సామాజిక మార్పుకు…

Read Full News

National: 2029లోనూ NDAదే హవానా?

National: దేశ రాజకీయాల్లో 2029 లోక్‌సభ ఎన్నికలపై అప్పుడే ఆసక్తి మొదలైంది.ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. కేంద్రంలో మరోసారి NDA కూటమిదే అధికారం అంటూ ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది.సర్వే ప్రకారం NDAకు 326 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే గత జనవరి సర్వేతో పోలిస్తే NDA బలంలో తగ్గుదల కనిపించింది. అప్పట్లో 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య…

Read Full News
Optimized by Optimole